నారాయణపేట టౌన్, మే 2 : పో లీసులు బాధితులకు అండగా ఉండి న్యాయ సహాయం అందించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సో మవారం ప్రజా ఫిర్యాదుల దినం ని ర్వహించగా, జిల్లాలోని 10 మంది బాధితులు తమ వినతులు అందజేశా రు. బాధితులతో నేరుగా మాట్లాడిన ఎస్పీ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఫోన్లో పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. పోలీసులు బాధితుల సమస్యలు ముందుగా తెలుసుకొని పరిష్కరించినచో చాలా వరకు జరుగబోయే నే రాలను అరికట్టేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. బా ధితుల ఫిర్యాదు మేరకు చేపడుతున్న దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు బాధితులకు తెలియజేయాలన్నా రు. అత్యవసర సమయంలో డయల్ 100కు సమాచా రం అందించాలని ప్రజలకు సూచించారు.
నకిలీ విత్తన దందాలు అరికట్టాలి
మండలాల వారీగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలతో నిఘా ఉంచి దాడులు నిర్వహించడంతో నకిలీ విత్తన దందాలు అరికట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించా రు. జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ఏవోలతో సోమవారం వీసీ నిర్వహించి మాట్లాడారు. పోలీసు, వ్యవసాయ శా ఖ అధికారులు గ్రామాల్లో దళారులు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినా, సరఫరా చేసినా, తయారు చేసినా, నా సిరకం ఎరువుల కొనుగోలు, విక్రయాలపై కఠినంగా వ్య వహరించాలన్నారు. వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని, వ్యాపారుల నుంచి తీసుకున్న బిల్లులను జాగ్రత్తగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాల క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులు, వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్సుధాకర్ మాట్లాడుతూ విత్తనాలపై రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని, నకిలీ విత్తనా లను అరికట్టడంలో పోలీసులకు పూర్తి సహకారాలు అం దిస్తామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, ఏవోలు పాల్గొన్నారు.
ఈద్గాల వద్ద పటిష్ట బందోబస్తు
రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాలోని ఈద్గాల వ ద్ద, మసీదుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిరంతరం పెట్రోలింగ్ ని ర్వహించాలని పోలీసులకు సూచించారు. ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.