నారాయణపేట, ఏప్రిల్ 6: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల అవలంభిస్తున్న వివక్ష వైఖరిని నిరసిస్తూ గురువారం ఉదయం 9గంటలకు పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తాలో మహారైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలోని రైతు సోదరులు, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు, టీఆర్ఎస్ మండల, పట్టణ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
వడ్లు కేంద్రమే కొనాలి
తెలంగాణలో పండించిన యాసంగి వడ్లు కొనాలని కేంద్రానికి వ్యతిరేకంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆదేశానుసారం జిల్లా కేంద్రం నారాయణపేటలో జరిగే నిరసన కార్యక్రమానికి మక్తల్ నియోజకవర్గ నాయకులు, మార్కెట్ చైర్మన్లు, పీఏసీసీఎస్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు, రైతుబంధు సభ్యులు, రైతన్నలు పెద్ద సంఖ్యలో హాజరై విజవంతం చేయాలని కోరారు.
విజవంతం చేయాలి
జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తా వద్ద ఉదయం 9గంటలకు నిర్వహిస్తున్న నిరసన దీక్షకు వేలాదిగా తరలాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్పాటిల్ ప్రకటనలో తెలిపారు. మండలంలోని రైతులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, ప్రజాప్రతినిధు లు, కార్యకర్తలు పాల్గొని విజయవంత చేయాలని కోరారు.
దీక్షకు తరలిరావాలి
జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం చేపట్టనున్న మహారైతు నిరసన దీక్షల్లో మండల రైతులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆశన్న ప్రకటనలో కోరారు.
అన్నిగ్రామాల నుంచి హాజరుకావాలి
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పట్టణాధ్యక్షుడు వెంకటేశ్గౌడ్, యువజన విభాగం మండలాధ్యక్షుడు ఆనంద్కుమార్ ప్రకటనలో కోరారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.