కోస్గి, జూన్ 23 : టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ హయాంలోనే పల్లెలన్నీ పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం కోస్గి మండలంలోని హకీంపేటలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కాంపోస్టు షెడ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకు అనుగుణంగా ప్రతి గ్రామ పంచాయతీకి పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీకి వచ్చిన ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో 122 మంది లబ్ధిదారులకు కల్యాణలక్షి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, ఎంపీపీ మధుకర్రావు, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం
కోస్గి, జూన్ 23 : అభివృద్ధి పనుల్లో సొంత పార్టీ నాయకులు పొంతన లేని సమాధానాలు చెబుతూ పనులు నిర్లక్ష్యం చేయడంపై ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో స్థానిక నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే మున్సిపల్ అభివృద్ధి పనులపై అసహనం వ్యక్తం చేశారు. ఇసుక లేకపోవడంతో పనులు నిలిపివేయాలని స్థానిక నాయకులు చెప్పడంతో పొంతన లేని సమాధానాలు చెప్పవద్దని, ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తే ఎందుకు రాదన్నారు. ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్ హరిచందనకు ఫోన్ చేసి కోస్గి మున్సిపల్ అభివృద్ధి పనులకు ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తున్నామని వెంటనే అనుమతించాలని కోరారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నెల రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి కావాలని మంత్రి కేటీఆర్తో ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడుదామన్నారు. ఇక నుంచి పని ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా నాయకులైన కాంట్రాక్టర్లను సహించబోమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రామకృష్ణ, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, ఎంపీపీ మధుకర్రావు, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, పీఏసీసీ ఎస్ చైర్మన్ భీంరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.