నారాయణపేట: పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ నూతన కమిటీ కార్యవర్గం సమావేశం నిర్వ హించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కమిటీలోని సభ్యులు నూతనోత్సాహంతో పని చేస్తూ పదవులను సమర్థ వంతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచిం చారు.
ప్రతి కార్యకర్తకు తాను అందుబాటులో ఉంటానన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అం దించి శాలువాతో సన్మానించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గందె అన సూయ, కౌన్సిలర్లు, నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.