ఊట్కూర్, ఆగస్టు 27: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అరవింద్ కుమార్ మాతృమూర్తి సుశీలమ్మ (78) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గురువారం ఆమె స్వగ్రామానికి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి, సుశీలమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్, శ్రీనివాస్ గుప్తా, రాజుల ఆశిరెడ్డి, మహిపాల్ రెడ్డి , బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్ రెడ్డి, తరుణ్, వెంకటేష్ గౌడ్, ఒబెదూర్ రెహమాన్ పాల్గొన్నారు.