ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పెద్ద జట్రం నుండి మక్తల్ మండలం జక్లేరు జాతీయ ప్రధాన రహదారి వరకు బీటీ డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం జక్లేరు ప్రధాన జాతీయ రహదారిపై బైఠాయించి నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మాస్ లైన్ పార్టీ నిరసనతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు బార్లు తీరాయి. మక్తల్ సీఐ రామ్లాల్, పోలీసులు చేరుకుని ట్రాఫిక్ను కంట్రోల్ చేశారు.