Narayanpet | నారాయణపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, చెరువుగట్టు దగ్గర పడేసి వెళ్లారు. అమ్మిరెడ్డిపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చెరువుగుట్ట దగ్గర పాప మృతదేహం లభించడంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వలస వెళ్లగా.. పాప తన అవ్వ తాతల దగ్గరే ఉంటుంది. ఈ క్రమంలో ఆ చిన్నారి హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.