నారాయణపేట, జనవరి 11 : ఆడపడుచులకు సీఎం కే సీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని పేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అన్నారు. దామరగిద్ద మండలకేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పా టు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై78 మందికి రూ.72 లక్షల 8 వేల 325 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్త శెన్యానాయక్ విద్యుత్షాక్తో మరణించడంతో పార్టీ సభ్యత్వ బీ మా చెక్కును మృతుడి భార్య కమిలిబాయ్ ఇంటికి వెళ్లి ప రామర్శించి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని వర్గాల సం క్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, పీఏసీసీఎస్ చై ర్మన్ పుట్టి ఈదప్ప, సర్పంచ్ ఆశమ్మ, ఎంపీటీసీ కిషన్రావు, నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కృషి
జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానని పేట ఎమ్మెల్యే ఎస్.రా జేందర్రెడ్డి అన్నారు. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ మె మోరియల్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీలు మంగళవారం ముగియగా, గెలుపొందిన జట్లకు బహుమతుల ప్ర దానం చేశారు. మొదటి బహుమతి దామరగిద్ద మండలం మద్దెల్బీడ్ గ్రామానికి చెందిన టీం, ద్వితీయ బహుమతి కె.ఎం.కె ఫ్రెండ్స్ సభ్యులు, తృతీయ బహుమతి అమర్ జ వాన్ గుర్మిట్కల్ టీంకు వచ్చింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ట్రోఫీలను అందజేశారు. మొదటి బహుమతి సాధించిన టీంకు స్వయంగా రూ.51వేలను వి తరణ చేశారు.
కార్యక్రమంలో పేట మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, మార్కెట్ కమి టీ వైస్ చైర్మన్ జగదీశ్, కౌన్సిలర్ గురులింగప్ప, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రకాంత్, సుదర్శన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, శివరాంరెడ్డి, శేఖర్రెడ్డి, హంసరాజ్, నిర్వాహకులు సు మిత్, చెన్నారెడ్డి, భరత్రెడ్డి, రవికుమార్, కాకర్ల మహేశ్ త దితరులు పాల్గొన్నారు.