కోయిలకొండ, అక్టోబర్ 22 : కాంగ్రెస్కు ఓటు వేస్తే నట్టేట ముంచేస్తారని, ఇ ప్పటికే నమ్మి మోసపోయిన కర్ణాటక రై తులు లబోదిబోమంటున్నారని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, ఉబ్బడితండా, కానుగుబండతండా, వింజమూరు తదితర గ్రామా ల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలకు, చేసే పనులకు ఎలాంటి పొంతన లేదన్నారు. కర్ణాటకలో రైతులకు 6గంటల కరెంట్ ఇవ్వడం లేదని, నమ్మి ఓటు వేస్తే రైతులను నట్టేట ముంచారని అక్కడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకొంటున్నది దేశంలోనే కేవలం తెలంగాణ ప్రభుత్వమన్నారు. తండాల ను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చే సి ఎంతో అభివృద్ధి చేశామన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి అఖండ మెజార్టీతో బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకొన్నారన్నారు. కోయిలకొండ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చే శామని, మరోసారి ఆదరిస్తే మరింత అ భివృద్ధి చేస్తామన్నారు. చేసిన అభివృద్ధికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రజలకు కరపత్రాల ద్వారా వివరిస్తున్నామన్నా రు. కార్యక్రమంలో పేట సమన్వయకర్త ఎస్.రవీందర్రెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బి.కృష్ణయ్య , సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు కన్వీనర్ మల్లయ్యయాదవ్, సర్పంచ్ నారాయణరెడ్డి, నాయకు లు రవి, భీంరెడ్డి, రాములు, శ్రీనివాస్రెడ్డితోపాటు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు..
మండలంలోని వివిధ గ్రామాల నుం చి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ఆదివారం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీపీ అర్జుమాన్ ఫాతి మా, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షు డు సయ్యద్ శమీమ్తోపాటు 150 మంది నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. కానుగుబండతండా, కళ్యాణ్నగర్, వింజమూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సమక్షంలో 250మంది కాంగ్రె స్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.