బిజినేపల్లి, మార్చి 26 : మండలంలోని వట్టెం గ్రామంలో స్వయంభువు గా వెలసిన నారదగిరి లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజ లు చేయడంతోపాటు ఎడ్ల బండ్ల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా శకటోత్సవం, ఉద్దాలు వంటి కార్యక్రమా లు నిర్వహించారు. అనంతరం పారువేట, తెప్పోత్సవ కార్యక్రమాలను కను ల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు రత్నయ్య, సీతారామయ్య, అమృత్రెడ్డి, నర్సింహారెడ్డితోపాటు భక్తులు పాల్గొన్నారు.