అచ్చంపేట, అక్టోబర్ 25 : దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ సర్వం కోల్పోయింది. ఉద్యమకారుడు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా అనూహ్యరీతిలో దూసుకెళ్లింది. తాగేందుకు దొరకని గుక్కెడు నీళ్లు.. అంతంతే విద్య, వైద్యం.. చిన్న రోగాలకే ప్రాణాలు పోయే దౌర్భాగ్యం.. రోడ్డు లేని గ్రామాలు.. వంతెనలు లేని వాగులు.. కరెంటు లేక కమ్ముకునే చీకట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే సమైక్య పాలనలో అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు ఒరిగింది శూన్యం. కానీ ఇదంతా గతం. గడిచిన పదేండ్ల కాలం లో అచ్చంపేట పరిస్థితి మారింది. తెలంగాణలోని పల్లె జనాల్లో బతుకు మార్పు కోసమే తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీ తెలంగాణలో మొదటిసారి గద్దెనెక్కడం.. కేసీఆర్ ముఖ్యమంత్రి అ య్యాక ఇప్పుడు పరిస్థితులన్నీ మారుతున్నాయి. ఎవరు అవునన్నా.. కాదన్నా అచ్చంపేట ని యోజకవర్గానికి ఎంజీకేఎల్ఐ ద్వారా సాగునీరు అందడంతో పల్లెలన్నీ పాడిపంటలతో పచ్చబడ్డాయి. ప్రభుత్వ వి ప్, ఎమ్మెల్యే గువ్వల బాల రాజు సారథ్యంలో నల్లమల అటవీ ప్రాంతం అభివృద్ధిలో పథంలో దూసుకుపోతున్నది.
2018 నవంబర్ 27న అచ్చంపేటలో ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ అచ్చంపేట ప్రజలకు మాట ఇచ్చారు. అచ్చంపేటకు సా గునీరు అందించి తీరుతానని ప్రకటించారు. సీఎం అచ్చంపేటకు ఎన్నికల నినాదం నిజం చేసి చూపారు. అచ్చంపేట రైతులు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అచ్చంపేట రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం అచ్చంపేట నియోజకవర్గంలోని నీటి పారుదల ప్రాజెక్టులు అయిన కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్, చిన్ననీటి పారుదల ప్రాజైక్టులపై పూర్తి సమీక్ష చేసి సాగునీరు అందని మండలాలను గుర్తించి వాటికి సాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని 2021 మార్చి 23న చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు. అచ్చంపేట నియోజకవర్గంలోని అత్యంత వెనుకబడిన మండలాలు లింగాల, అమ్రాబాద్, పదర, బల్మూర్, అచ్చంపేట మండలాల్లోని దాదాపు 75వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అచ్చంపేట ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును స్వయంగా సీఎం కేసీఆరే డిజైన్ చేశారు. ప్రాజెక్టులో భాగంగా మొదటి ఫేజ్- 1 పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల ఈనెల 9న పైలాన్ను ఆవిష్కరించి అచ్చంపేట చిరకాల ఆకాంక్షకు జీవం పోషి ఇచ్చినమాట నిజం చేశారు. పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఎదుల రిజర్వాయర్ నుంచి 25 కిలో మీటర్ల గ్రావిటీ కాల్వ నీటిని తరలించి ఉమామహేశ్వరం, చెన్నకేశవస్వామి, మద్దిమడుగు ఆంజ న్న రిజర్వాయర్లు, నిరంజన్షావలీ లిఫ్టు ఏర్పాటు చేసి ప్రతిగుంటకు సాగునీరు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. రూ.1061 కోట్ల వ్యయంతో టెండర్ పిలువగా బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెండర్ను దక్కించుకున్నది. ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు, లిఫ్టులకు సీఎం కేసీఆరే స్వయంగా ఈ ప్రాంతంలోని దేవుళ్ల పేర్లను నామకరణం చేశారు. అన్ని అనుకూలిస్తే ఏడాదిలోగా అచ్చంపేటకు కృష్ణమ్మ తరలిరానుంది.
ఉమ్మడి పాలనలో ఉనికి కోల్పోయిన ఎవుసం తెలంగాణ రాష్ట్రంలో పండుగలా మారింది. సాగుకు కేసీఆర్ సర్కారు సంపూర్ణ సహకారం అందిస్తోంది. రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. కాలువల ద్వారా నీళ్లు పారుతున్న పల్లెల్లో జనం సంబురంగా మురిసిపోతున్నారు. సాగునీరు రాకతో రైతుల ముఖాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. కర్షకుల కష్టాలు తెలిసిన రాష్ట్ర సర్కారు గత ప్రభుత్వాలకు భిన్నంగా మునుపెన్నడూ లేని విధంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. దీంతో దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న అచ్చంపేట నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు కృష్ణ జలాలు అందుతున్నాయి. ఇటీవల వర్షకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలోని చెరువుల్లోకి తగినంత నీరు చేరలేదు. ఎంజీకేఎల్ఐ మహాత్యంతో గొలుసు కట్టు చెరువులు పూర్వవైభవం సంతరించుకోగా ఒకప్పుడు వెలవెలబోయిన ఆయకట్టు భూములు ఇప్పుడు ఆకుపచ్చగా మారాయి. పచ్చగా కళకళలాడుతున్నాయి. తెలంగాణ సర్కారు వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తుండడంతోపాటు ఎంజీకేఎల్ఐ రాకతో చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు పెరిగి బోరు బావుల కింద పంటల విస్తీర్ణం మరిం త పెరిగింది. నీళ్లు పుష్కలంగా ఉండడంతో రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పండ్ల తోటలు, కూరగాయల సాగుపై దృష్టి పెట్టి రాణిస్తున్నారు.
వలసలు, వెనుకబాటుకు గురైన అచ్చంపేట ప్రాంతం తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనేక రంగాలు, సంక్షేమ పథకాల్లో వేలాది కోట్ల నిధు లు తెచ్చి అభివృద్ధికి బాటలు వేశారు. ఏ గ్రామం, పల్లె, తండాలు, గూడెంలకు వెళ్లినా అభివృద్ధి కండ్లకుకట్టినట్లు కనిపిస్తోంది. వందపడకల దవాఖాన నిర్మించి ప్రజలకు సకాలంలో వైద్యసేవలు అందుతున్నాయి. ఉప్పునుంతలలో 30పడకల దవాఖాన భవనం నిర్మించారు. పట్టణంలో 150 డబుల్బెడ్రూంలు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మున్సిపల్ పరిధిలో అభివృద్ధ్ది శరవేగంగా కొనసాగుతుంది.రోడ్లు, విద్య, వైద్యం, సా గు, తాగునీటి సమస్యలు పరిష్కారం అయ్యాయి. పుల్జాల-చంద్రసాగర్ కేఎల్ఐ కాల్వ పొపంపు పనులు కొనసాగుతున్నాయి. ఆలయాలు, చర్చీ లు, మసీదులకు నిధులు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని ఎన్నికల కోడ్ రావడంతో పనులు ప్రారంభంకావాల్సి ఉన్నది. రెవెన్యూ డివిజన్, రెండు కొత్త మండలాలు, 75 కొత్త జీపీలు ఏర్పాడ్డాయి. మరో 20 నూతన జీపీల కోసం ప్రతిపాదన డ్రూత్వ పరిశీలనలో ఉన్నది. అన్ని గ్రామాలు, పల్లెలు, తండాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది.