వెల్దండ : నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల, ఎంఆర్సీ ప్రాథమిక పాఠశాల, మండల పరిధిలోని రాచూరు ఉన్నత పాఠశాలను ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నర్సమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో మన ఊరు- మన బడి అభివృద్ధి పనులు పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. వెల్దండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్తో కలిసి నీటి సంపునకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.సర్కార్ బడుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు.