వెల్దండ: రైతు సంక్షేమం అభివృద్ధి చెందడంలో సింగిల్ విండో సొసైటీలు కీలక పాత్ర పోషించనున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం వెల్దండ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు అధ్యక్షతన మహాజన సభ కార్యక్రమం నిర్వహించారు. రైతులు, ప్రజాపతినిధుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమ అభివృద్ధి కోసమే కాకుండా చిరు వ్యాపారులకు సైతం సొసైటీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయన్నారు. రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు సొసైటీల ద్వారా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు.
గత సీమాంద్రుల పాలనలో ఎరువులు, విత్తనాల కోసం చెప్పులను క్యూలో పెట్టి పోలీసుల లాఠీల దెబ్బల మధ్య కొనుగోలు చేయాల్సిన పరి స్థితి ఉండేదని, ప్రస్తుతం సొసైటీలో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సొసైటీ చైర్మన్ భాస్కర్ రావు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిస్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సొసైటీని రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిల్ప డమే తన ధ్యేయమన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వెంకటయ్య గౌడ్, రాఘవేందర్ రెడ్డి, నిరంజన్, జంగయ్య, శేఖర్, నరేశ్, రాజేందర్ రెడ్డి, గండె య్య, సంతోష, వైస్ ఎంపీపీ శాంతి, రైతుబంధు అధ్యక్షుడు భాస్కర్రావు, సర్పంచ్లు భూపతి రెడ్డి, వెంకటేశ్యరావు, అంజీనాయక్, మల్లీశ్వరి, శారదమ్మ, పత్యా నాయక్, శ్రీను నాయక్ ఎంపీటీసీలు గుత్తి వెంకటయ్య, రాములు, హలీమ్, సొసైటీ కార్యదర్శి శ్రీను, తదితరులు ఉన్నారు.