వెల్దండ జూన్ 21: సీఎం సహాయనిధి (CM Relief Fund) పేదల పాలిట వరమని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమళ్ళ కృష్ణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన నెంట చరణ్ జిత్ దవాఖాన ఖర్చులకోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే సహకరించడంతో సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరు అయిన రూ.90 వేల చెక్కును పెద్దాపూర్లోని అతని కుటుంబ సభ్యులకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుద్దట్టి లక్ష్మారెడ్డి, వరికుప్పల ఆంజనేయులు, నెంట శీను, శివధనుషు, విజేందర్ రెడ్డి,అజహరుద్దీన్, సుధాకర్, హరిలాల్ నాయక్, తిరుపతి నాయక్,అనిల్ కుమార్,కాటిక రాములు, కొప్పు బాలయ్య, బండి కృష్ణయ్య, మహేష్,అరుణ్ కుమార్, చింటు,వంశీ తదితరులు పాల్గొన్నారు.