వెల్దండ, జనవరి 19 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని అజిలాపూర్ గ్రామంలో రూ.1.50 కోట్ల నిధులతో నిర్మించిన రైతు వేదిక, సీసీ రోడ్లు, వాటర్ట్యాంకులు, హై మాస్ట్ లైట్లను గురువారం వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ కాలెలక్ష్మమ్మవెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డినారాయణరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో ఇటీవల తాటిచెట్టుపై నుంచి కిందపడి మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్త యాదయ్యగౌడ్ కుటుంబానికి పార్టీ తరఫున మంజూరైన బీమా నగదు రూ. 2లక్షల చెక్కును మృతుడి భార్యకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజితారెడ్డి, ఎంపీపీ విజయ, వైస్ ఎంపీపీ శాంతి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు భాస్కర్రావు, ఎంపీటీసీ కేశమోని లక్ష్మమ్మ మల్లేశ్గౌడ్, భైరాపూర్ సర్పం చ్ దార్లకుమార్, రైతు బంధు సమితి గ్రామఅధ్యక్షు డు రవిగౌడ్, ఉప సర్పంచ్ సులోచనమ్మ, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రమేశ్గౌడ్, నాయకులు కరుణాకర్రెడ్డి, కృష్ణయ్య, మహేశ్ తదితరులు ఉన్నారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ
మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సర్పంచ్ చంద్రమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణ, గోళి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం, ఎంపీపీ విజయ, వైస్ ఎంపీపీ శాంతి, బీసీ సం ఘం రాష్ట్ర నాయకుడు పెద్దయ్యయాదవ్ పాల్గొన్నారు.