తాడూరు: టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులకు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. రైతుల అభివృద్దియే ప్రభుత్వ ధ్యేయంగా అన్ని రకాలుగా ఆదుకునేందుకు రైతుబంధు, రైతుబీమాతోపాటు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారిని ఆదుకుంటున్నారన్నారు. ఆదివారం తాడూరు మండల పరిధిలోని సిర్సవాడ గ్రామంలోని రైతువేదిక, వైకుంఠధామాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేకపోవడం వల్ల ఎన్నోరకాల ఇబ్బందులు పడుతుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించాల ప్రతి గ్రామంలో 12లక్షల 60వేలతో వైకుంఠధా మం, డంపింగ్యార్డు తదితర పనులను చేపట్టరన్నారు. అదేవిధంగా రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందు కు గాను ప్రతి క్లస్టర్లో 27లక్షల రూపాయల తో రైతువేదిక భవనాలను నిర్మించడం జరుగుతుందని ఆయన అన్నారు.
వీటి ద్వారా రైతులు మారుతున్న పరిస్థితులను బట్టి వేసిన పంట వేయకుండా పంట మార్పిడి చేసుకునే విధంగా రైతులు తమ పంటలకు వివిధ రకాల తెగుళ్ల గురించి తెలుసుకునేందుకు రైతువేదిక భవనంలో ఆ క్లస్టర్ వ్యవసాయ అధికారులు రైతులకు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
అంతేకాకుండా సిర్సవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని గ్రామ ప్రజలు తమ దృష్టికి తీసు కురావడం జరిగిందని, డిసెంబర్ నెలలో అన్ని హంగులతో కూడిన ఆధునీకరణ భవనాన్ని నిర్మించతలపెట్టినట్లు ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన అన్నపూర్ణ ఇండస్ట్రీస్ను ప్రారంభించారు. గ్రామంలో అన్నపూర్ణ ఇండస్ట్రీస్ను ప్రారంభించినందుకు వేణును అభి నందించారు.
కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్రెడ్డి, ఎంపీటీసీ రమేష్రెడ్డి, ఎంపీపీ గుర్రాల శ్రీదేవి, వైస్ ఎంపీపీ శివలీల, ఏడీ రమేశ్ బాబు, ఏవోచంద్రప్రకాశ్గౌడ్, ఏఈ ఉపేందర్రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యార రమేశ్, ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్, నాయకులు తిరుపతిరెడ్డి, వెంకట్రెడ్డి, శేఖర్గౌడ్, అనిల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, చిన్న రాములు, కొత్తపల్లి వెంకటయ్యతోపాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.