అచ్చంపేట: మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపర్చి ఆర్థికంగా ఎదగడానికి అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం అచ్చంపేట మండలంలోని నడింపల్లి చెరువులో ప్రభుత్వం ద్వారా చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా చెరువు వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల కు ఆదుకుంటున్న విధాంగానే సీఎం కేసీఆర్ మత్య్సకారుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
మత్స్యకారులు చేపలను మార్కెటింగ్ చేసుకునేందుకు డీసీఎం, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అందించడం, అనుకోని ప్రమాదంలో మృతి చెందితే రైతుబీమా మాదిరిగానే మత్స్యకారులకు ప్రత్యేక బీమా ద్వారా రూ. 5లక్షల పరిహారం అంద జేస్తున్నారని అన్నారు. ప్రతి ఏడాది చెరువులు, రిజర్వాయర్లు, కాలువలలో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తూ మత్య్సకారుల జీవనోపాధి మెరుగు పర్చేందుకు ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు.
ఈ ఏడాది జిల్లాలో 2.95 కోట్ల చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని దీని ద్వారా ఈ సారి జిల్లాలో దాదాపు 90కోట్ల విలువైన సంపదన మత్స్యకారులకు అందించడం జరుగుతుందన్నారు. అచ్చంపేట ప్రాంతంలో మత్స్యకారుల కోసం ఐస్ ఫ్యాక్టరీ కోసం తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. అచ్చంపేటలో నూతనంగా అన్ని హంగులతో నిర్మించ నున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తామన్నారు.
అన్ని కులాలు అర్థికంగా బలోపేతమైతేనే రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని సీఎం కేసీఆర్ విశ్వాసంతో అన్ని కులాలు, వర్గాలు, వృత్తుల వారికి కావాల్సిన పథకాలు, వసతులు కల్పించి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా జేడీ లక్ష్మప్ప, జడ్పీటీసీ మంత్రియా నాయక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహా గౌడ్, ఎంపీపీ శాంతలోక్యానాయక్, మాజీ ఎంపీపీ పర్వతాలు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు నిరంజన్, ప్రతాప్రెడ్డి, అజయ్, శ్రీను, మత్స్యకారులు, సోసైటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
78మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
అచ్చంపేట క్యాంపు కార్యాలయం నందు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు 78మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశా రు. నియోజకవర్గంలోని లింగాల, అచ్చంపేట, పదర, అమ్రాబాద్, ఉప్పునుంతల మండలాల పరిధిలోని లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పేదలను ఆదుకునేందుకు సాయం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తులసిరాం, మంత్రియానాయక్, రాంబాబు, లక్ష్మ మ్మ, గోపాల్నాయక్, అమినోద్దిన్, నర్సయ్యయాదవ్, రవీందర్రావు, లోక్య నాయక్, పర్వతాలు, బాలు, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.