నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ మార్గదర్శకాలను పాటించకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ, విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వంగూరు మండలం పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీకి చెందిన గ్రేడ్-IV పంచాయతీ కార్యదర్శి పి.కిషన్, కొల్లాపూర్ మండలం పరిధిలోని సింగోటం గ్రామపంచాయతీకి చెందిన గ్రేడ్-III పంచాయతీ కార్యదర్శి పి. అర్జునయ్య, అలాగే కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామపంచాయతీకి చెందిన గ్రేడ్-III పంచాయతీ కార్యదర్శి ఆర్. ప్రేమచంద్లను విధుల నుండి సస్పెండ్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా వంగూరు, కొల్లాపూర్ మండలాల పంచాయతీ అధికారులకు షోకాస్ నోటిసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.