నాగర్కర్నూల్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : దళితబంధు పథకంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలోని చారకొండ మండలానికి రూ.50కోట్లు మం జూరయ్యాయి. ఓటర్లుగా మిగిలిన దళితులను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. చరిత్రలో ఏ రాష్ట్రం లో లేనివిధంగా దళితబంధు పథకాన్ని సీఎం అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.10లక్షలను ప్రభుత్వం ఉచితంగా దళిత కుటుంబాలకు అందజేస్తుంది. ఇలాంటి బృహత్తర పథకానికి రెండో విడుతలో భాగంగా గత సెప్టెంబర్ 2న చారకొండ మండలం ఎంపికైంది. ఆ మరుసటి నెలలో రూ.50కోట్ల నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ క్రమంలో ప్రతిపక్షాల దృష్ప్రాచారం కాస్త గందరగోళానికి గురి చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిధులను మంజూరు చేయడం విశేషం. ఈ నిధులు నేరుగా జిల్లా కలెక్టర్ ఖాతాలో జమయ్యాయి. దీంతో దళితబంధు పథకం వెలుగులు మండలంలో నిండనున్నాయి.
ఈ పథకంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చారకొండ ఏకైక మండలం కావడం గమనార్హం. చారకొండ మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1206 కుటుంబాలు ఉండగా 4వేలకు పైగా దళితులున్నారు. ఈ సంఖ్య 2వేల కుటుంబాల వరకు చేరినట్లు ప్రాథమిక అంచనా. ఇప్పటికే మండలంలో సాం ఘిక సంక్షేమ, పంచాయతీ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో మండలంలోని అ న్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే చేపట్టా రు. ఒక్కో కుటుంబంలో యజమాని, కుటుంబ సభ్యుల పేర్లు, విద్యార్హతలు, రేషన్కార్డు, బ్యాంక్ఖాతా తదితర వివరాలు సేకరించారు. ప్రభుత్వం ఆదేశాలు రాగానే దళితులు కోరుకున్న యూనిట్ల ప్రకారం ప్రభుత్వం నిధులు మంజూరు చేయనున్నది. దళితబంధు పథకంపై ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధలు అవగాహన కల్పించారు. ప్రభుత్వం నుంచి తాజా ఆదేశాలు వచ్చిన వెంటనే కార్యాచరణ చేపడుతామని అధికారులు తెలుపుతున్నారు. దళితబంధు పథకం చారకొండ మండలంలోని దళితుల్లో కొత్త వెలుగులు నింపనున్నది.
కలెక్టర్ ఖాతాలో జమయ్యాయి
ఉమ్మడి జిల్లాలో దళితబంధు పథకానికి నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కలెక్టర్ ఖాతాలో నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో దళితబంధు పథకం అమలుకు చర్యలు తీసుకుంటుంది.