నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి జూనియర్ కళాశాలకు భవనాన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మంగలవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. 80 సంవత్సరాల క్రితం నిర్మించిన జూనియర్ కళాశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందని, కళాశాల నూతన భవనాన్ని మంజూరు చేయాలని అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు.
కళాశాల తరగతి గదిలో కిటికిలు, తలుపులు తొలగిపోయాయని అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంగా ఏర్పాటైన నాటి నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని, పాత భవనంలో విద్యాభ్యాసం కొనసాగించడంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి స్పందించి నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరారు.