కొల్లాపూర్, ఆగస్టు 22 : గిరిజన తండాల అభివృద్ధికి అ న్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే బీ రం హర్షవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. మండల పరిధిలోని బోడబండతండా, ఎల్లూరు గ్రామాల్లో సోమవారం ఉదయం ఎ మ్మెల్యే పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. బోడబండతండాలో ఇటీవల వర్షాల కారణంగా కూలిపోయిన గిరిజన మహిళ శ్యామల ఇంటిని పరిశీలించి అధైర్యపడొద్దని, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేస్తామని ఎమ్మె ల్యే బీరం బాధితురాలికి హామీ ఇచ్చారు. అదే తండాలో ఇటీవల హనుమంతు, శివనాయక్ మాతృమూర్తి మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి కు టుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బోడబండతండాలో ప్రజల సమస్యలను అడిగితెలుసుకుని తండా అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఎమ్మెల్యే తండాలో పర్యటిస్తూ ఓ ఇంటి ఎదుట అరుగుపై కూర్చున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డికి గిరిజన మహిళ శ్యామల రాఖీ కట్టి తన ఆప్యాయతను వ్యక్తం చేసింది. అనంతరం ఎల్లూరు గ్రామంలో పర్యటించి గ్రామస్తుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బీరం అనారోగ్య కారణాలతో మృతి చెందిన పలువురు కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మెల్యే బీరం వెంటా మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్నాయక్, దళిత బంధు పథకం తాలూకా కోఆర్డినేటర్ కాటం జంబులయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాంచందర్యాదవ్, ఎంపీటీసీ శంకర్నాయక్ పాల్గొన్నారు.