తెలకపల్లి , ఆగస్టు 22: ప్రతిఒక్కరూ జాతీయ భావం కలిగి ఉండాలని సీఎల్ఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ రాజమహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సీఎల్ఆర్ విద్యా సంస్థల్లో సోమవారం ఏర్పాటు చేసిన వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలు, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు రాజేందర్రెడ్డి, మురళీధర్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రకాశ్రెడ్డి, సందీప్కుమార్, వెంకటేశ్వర్లు, అధ్యాపకులు , విద్యార్థులు తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు బహుమతులు అందజేత
వెల్దండ, ఆగస్టు 22 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాలు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాలలో వివిధ పోటిల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సంజీవ్రెడ్డి మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, కబడ్డీ, ఉపన్యాస, మ్యూజికల్, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమం లో అధ్యాపకులు విజయలక్ష్మి, ప్రవీణ, శివప్రసాద్, వీణ, రమేశ్, సుమలత, అంజలి, తిరుపతయ్య పాల్గొన్నారు.
ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి
నాగర్కర్నూల్టౌన్, ఆగస్టు 22 : స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ లక్ష్మి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను సోమవారం వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వివిధ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకటేశ్వర్రావు, అధ్యాపకులు షహజాదిబేగం, లింగయ్య, శ్రీనివాసులు, కవిత, కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
కల్వకుర్తి జూనియర్ కళాశాలలో ..
కల్వకుర్తి, ఆగస్టు 22 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను సోమవారం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు దేశభక్తిని చాటేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, షీల్డ్స్, ప్రశాంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సురేందర్రెడ్డి, రిటైర్డ్ ఎంఈవో కృష్ణయ్య, రిటైర్డ్ నర్సింహారెడ్డి, అధ్యాపకులు వేణు, సదానందంగౌడ్, రమాకాంత్, శ్రీనివాస్రెడ్డి, పరశురాం, బాల్రాజు, జుబేరుద్దీన్, శ్రీనివాస్, అహ్మద్అలీ, సంతోశ్గౌడ్, ఖర్షీద్బేగం, బాలయ్య పాల్గొన్నారు.
చారకొండ మండలంలో..
చారకొండ, ఆగస్టు 22 : వజ్రోత్సవాలు ముగింపులో భాగంగా సోమవారం చారకొండలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జీహెచ్ఎం శంకర్నాయక్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ లెనిన్బాబు, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
చదువుతోపాటు క్రీడలు ముఖ్యం
బిజినేపల్లి, ఆగస్టు 22: చదువుతోపాటు ఆటలకు కూడా విద్యార్ధులు మంచి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీపీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండలంలోని పాలెం జెడ్పీ పాఠశాలలో వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చాటిన వారికి సోమవారం బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ స్వతంత్య్ర వేడుకల స్ఫూర్తితో విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించి మంచి పౌరులుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్యానాగరాజు, ఎంఈవో భాస్కర్రెడ్డి, పాలెం ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్రెడ్డి, సురేందర్, వెంకటేశ్వర్లు, చంద్రమోహన్రెడ్డి, ఉన్నారు.