నాగర్కర్నూల్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : బాలబాలికలకు వెట్టిచాకిరి నుంచి విముక్తి క ల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ది. ప్రతినెలా జూలై 1 నుంచి 31వ తేదీ వరకు గత ఎనిమిదేండ్లుగా ‘ఆపరేషన్ ముస్కాన్’ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా కార్మికులుగా పనిచేస్తున్న బడీడు పిల్లలను గుర్తించనున్నారు. ఇలా గుర్తించిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు, అనాథలు ఉంటే హాస్టళ్లు, కస్తూర్బా వంటి సంస్థల్లో చే రుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు తమ పిల్లలను హాస్టళ్లలో ఉంచడం లేదా కూలీలకు వెళ్తూ పరిరక్షణను విస్మరిస్తున్నారు. దీంతో హాస్టళ్లలోని పిల్లలు పాఠశాలలకు వెళ్లకుండా హోటళ్లు, కిరాణాలు, రెస్టారెంట్లు, ఇండ్లు, భవనాల్లో పని పిల్లలుగా, కూలీలుగా మారుతున్నారు. తల్లిదండ్రుల పేదరికం కూడా పిల్లల ను పట్టించుకోలేని స్థితికి చేరుస్తున్నది. పిల్లలతో తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవచ్చని దుకాణాలు, ఇండ్ల యజమానులు కూలీకి పెట్టుకుంటున్నారు.
ఇది బాల కార్మిక హక్కులు, చట్టాలకు విరుద్ధం. దీనిపై ప్రభుత్వం ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. దీం తో బడీడు పిల్లలు బాలకార్మికులుగా మగ్గుతూ చ దువుకు దూరమవుతున్నారు. ప్రభుత్వం ఉచితం గా చదువు, వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నా త ల్లిదండ్రులు, సమాజం నిర్వాకం భావిభారత పౌ రులను కూలీలుగా మారుస్తున్నది. ఇలాంటి పనుల్లో నిమగ్నమైన బాలలు భవిష్యత్తులో సంఘ విద్రోహ శక్తులుగా మారే ప్రమాదమున్నది. ఇక బాలికలు లైంగికదాడుల కు గురవుతున్నారు. ఈ సంఘటనలన్నింటికీ బాలకార్మిక వ్యవస్థ, చట్టాల ఉల్లంఘనగానే ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఏడు విడుతలుగా జూలైలో ఆపరేష న్ ముస్కాన్ అమలుచేస్తున్నది. ఈ ఏడాది కూడా జూలై 1 నుంచి నెల రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యం లో అధికారులు సిద్ధమయ్యారు. మహి ళా శిశు సంక్షేమం, కార్మిక శాఖ, ఎస్సీ, ఎ స్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలతో కలెక్ట ర్, ఎస్పీల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశా లు నిర్వహించారు.
గతంలో ఆపరేషన్ ము స్కాన్ అమలైన తీరు, ప్రస్తుతం తీసుకోవాల్సి న చర్యలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఎ క్కడైనా వీధి బాలలు, బాల కార్మికులు క నిపిస్తే పోలీసులకు లేదా చైల్డ్లైన్-1098 నెంబర్కు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు. దీనికి సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలని మండలస్థాయి అధికారులకు ఆదేశించారు. ఎక్కడైనా బాల కార్మికులు పని చేస్తే వెంటనే సమాచా రం ఇవ్వాల్సిందిగా ప్రజలకు పోలీ సు శాఖ కోరుతున్నది. బడీడు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్ర కారం శిక్షించడంతోపాటు ఎ స్సీ, ఎస్టీ పిల్లలుంటే అట్రాసిటీ చట్టం కూడా అమలు చేయనున్నారు. బడీడు పిల్లల కోసం ఆపరేషన్ ముస్కాన్-8తో అన్ని శాఖలు కార్యరంగంలోకి దిగాయి. గత ఏడు విడుతల్లో నాగర్కర్నూల్ జిల్లా లో ఈ కార్యాచరణ ద్వారా 435 మందికి వెట్టి నుంచి వి ముక్తి కలిగింది.
పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు..
బడీడు పిల్లలంతా బడుల్లోనే ఉండాలి. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, వ్యాపార దుకాణాలు, ఇండ్లల్లో, ఇంటి పనుల్లో కూలీలుగా పెట్టుకుంటే చర్యలు తీసుకుంటాం. జైలుశిక్ష కూడా విధిస్తాం. ఎక్కడైనా బాల కార్మికులు పని చేస్తుంటే 1098 నెంబర్కు ఫోన్ చేయడం లేదా సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలి. ఆపరేషన్ ముస్కాన్-8 విజయవంతానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలి.
– మనోహర్, ఎస్పీ, నాగర్కర్నూల్