కొల్లాపూర్రూరల్, జూన్ 27 : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉం టుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. కొల్లాపూర్ పట్టణానికి చెందిన గువ్వలి ఆంజనేయులు టీఆర్ఎ స్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఇటీవల రోడ్డు ప్ర మాదంలో మృతి చెందాడు. సోమవారం మృతుడి కు టుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యాన్నిచ్చారు. పార్టీ నుంచి మంజూరైన బీమా సోమ్ము రూ.2లక్షల విలువగల చెక్కును ఎమ్మెల్యే బీరం మృతుడి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా చెక్కును అందుకున్న బాధిత కు టుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకం గా పనిచేసే కార్యకర్తలకు పార్టీ అధిష్టానం బీమా సౌకర్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే బీరం కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉన్న ప్రతి కార్యకర్తకు, నాయకులకు ఎప్పటికీ అన్యాయం జరగదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి కొల్లాపూర్ దవాఖానలో చికిత్స పొందుతున్న మండలంలోని సింగోటం గ్రా మానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు బాలస్వామిని సో మవారం ఎమ్మెల్యే బీరం పరామర్శించారు. ప్రమాదం జరిగిన వివరాలను తెలుసుకున్నారు. సింగోటం గ్రామం నుంచి బాడుగదిన్నె వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని ఎమ్మెల్యేకు వివరించారు. మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వైద్యులకు ఎమ్మెల్యే చెప్పా రు. ఎమ్మెల్యే వెంట కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.
దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు
కొల్లాపూర్ పట్టణ శివారులో అటవీ సరిహద్దు ప్రాంతంలో గల హజ్రత్ ఖాదర్ బాషా దర్గా వద్ద ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే వెంట మండల పరిషత్ అధ్యక్షుడు భోజ్యానాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ జాఫర్, సర్దార్ఖాన్, నాయకులు బొట్టు శ్రీనివాసులు, విక్రమ్, అజ్మిత్పాషా పాల్గొన్నారు.