‘కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్గాంధీ వరంగల్ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రైతుల బతుకులు మార్చేస్తా, తెలంగాణ రూపురేఖలు మార్చేస్తా అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి.. కాంగ్రెస్ నాయకులకు 50 ఏండ్ల పాటు అధికారం కట్టబెట్టాం.. నెహ్రూ నుంచి ఇందిరా, రాజీవ్, సోనియాగాంధీ.. నేడు రాహుల్ వరకు ఐదు తరాలు, ఐదు దశాబ్దాలు అవకాశం ఇచ్చాం. కాంగ్రెస్ కాలం చెల్లిన మందులాంటిది. భూమి పుట్టినప్పుడు పుట్టింది. ఆ పార్టీకి చరిత్ర తప్పా భవిష్యత్ లేదు. ఏ ఎన్నికల్లో అయినా డిపాజిట్లు గల్లంతవుతాయి. పరాభవాలు మాత్రమే మిగులుతాయి. రాహుల్ గాంధీని మూడు రోజులు గుంజుకొని తీసుకెళ్లినా అడిగే పరిస్థితి లేదు. రాహుల్ను ఈడీ తీసుకెళ్లినా ఏం చేయలేని దుస్థితి నెలకొన్నది. కరెంట్, తాగు, సాగునీరు, పింఛన్లు ఇయ్యక.. సరైన విద్య అందించక.., సోమశిల బ్రిడ్జి కట్టించక.., 50 ఏండ్లపాటు రాష్ర్టాన్ని సర్వనాశనం చేసింది. చావడానికి సిద్ధంగా.. పాడెమీద పీనుగలా కాంగ్రెస్ పరిస్థితి మారింది. వారికి కులపిచ్చి.. ఒక్క వర్గానికే ఓట్లు వేయండి, పగ్గాలు అప్పజెప్పండి అని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు.’ అని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
‘ఇంకో పార్టీ (బీజేపీ) గురించి ఎంత చెప్పుకుంటే అంత మం చిది. అస్తవ్యస్త ఆలోచనలతో దేశాన్నే రావణ కాష్టంలా మార్చిం ది. అనాలోచిత విధానాలతో పరిపాలిస్తున్నది. దేశంపై అవగాహన, వాస్తవిక ఆలోచనలేదు. మాట్లాడితే విషం, విద్వేషం నింపడమే వారి అభిమతంగా మారింది. అర్థవంతమైన తొవ్వ లో దేశాన్ని నడిపించడం లేదు. తెల్లారి లేస్తే హిందూ-ముస్లిం మాటలు, పక్కవాడిని పగవాడిగా చూపించడం, మతాన్ని కించపర్చేలా వ్యవహరించడం తప్పా వేరే పనే లేదు. మోదీ ప్రధాని కాకముందు సిలిండర్ రూ.400 ఉంటే.. ఇప్పుడు రూ.1050కి చేరుకున్నది. మా ఆడబిడ్డలు ఎంతో గర్వంగా తెల్తుతుకొని బతుకుతున్నారు.. ఎవడు అసమర్థుడు, దద్దమ్మ, ఎవరిది చేతగానితనమో ప్రజలకు తెలుసు.
గతంలో ఎండాకాలం వస్తే ఎమ్మెల్యేలు, సర్పంచులు ఊళ్లో ఉండలేని పరిస్థితి. బిందెలు, కుండలు తీసుకొచ్చి ధర్నాలు, నిరసనలు చేస్తరో అని భయపడే దుస్థితి. రైతులు వచ్చి తలుపులకు తాళాలు వేస్తరేమోనని విద్యుత్ అధికారులు సబ్స్టేషన్లో ఉండేవారు కాదు. కానీ నేడు తెలంగాణ వచ్చాక.. కేసీఆర్ సీఎం అయ్యాక పరిస్థితులన్నీ మారిపోయాయి. నిరంతర విద్యుత్, మిషన్ భగీరథతో సమస్యలు పరిష్కారమయ్యాయి. కేవలం ఎనిమిదేండ్లలోనే ఆరున్నర దశాబ్దాల్లో చేయలేని ఎన్నో పనులు సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసి చూపించాం. గతంలో 29 లక్షల పింఛన్లు ఉంటే.. ఇప్పుడు 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో దొడ్డుబియ్యం, నీళ్ల చారుతో పెట్టినమా అంటే పెట్టినట్లున్న భోజనం.. ఇప్పుడు సీఎం మనవడు తినేలా భోజనం పెడుతున్నాం. ఇదంతా సీఎం కేసీఆర్ హయాంలోనే సాధ్యం.’ అని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.
నాగర్కర్నూల్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేవలం ఎనిమిదేండ్లలోనే ఎంతో అభివృద్ధి జరిగింది. జూలై, ఆగస్టులో ఇం టింటికి వచ్చి అర్హులుంటే ఆన్ ద స్పాట్ పింఛన్లు ఇస్తాం. రేషన్ కార్డులు ఇస్తాం. అభివృద్ధి కాముకుడైన కేసీఆర్ వల్లే రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతున్నది. రాష్ర్టానికి కులం, మతం పిచ్చోళ్లు వద్దు.. అభివృద్ధి చేసే వారే కావాలి’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో రూ.147 కోట్లతో చేపట్టిన గోపల్దిన్నె లింక్ కెనాల్, బిజినేపల్లి మండలం శాయిన్పల్లిలో రూ.76 కోట్లతో చేపట్టిన మార్కండేయ లిఫ్ట్ పనులకు, దాదాపుగా రూ.700 కోట్ల అభివృద్ధి పనులకు వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి మంత్రి కేటీఆర్ శం కుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్, బిజినేపల్లిలో ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, మర్రి జ నార్దన్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రం లో 973 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి.. ఒక్క విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఏడాదికి 5 లక్షల మందికి మెరుగైన విద్యనందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి సంస్కారవంతమైన ప్ర భుత్వం ఉన్నదా..? లేదా..? అని ఆత్మవిమర్శన చేసుకోవాలన్నారు.
ఇంటర్, డిగ్రీ, ఇంజినీర్, డాక్టర్ చదువులకు రూ.20 వేల కోట్లు అందిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ర్టాల్లో అయి నా సీఎం కేసీఆర్ లాంటి మార్క్ పాలన ఉన్నదా అని ప్రశ్నించారు. విదేశీ విద్యకు అంబేద్కర్ ఓవర్సీస్, ఫూలే పేరుతో రూ. 20 లక్షలు ఇస్తున్నామన్నారు. కులం, మతంతో సంబంధాలు లేకుండా 18 ఏండ్లు నిండి తెల్ల రేషన్కార్డు ఉన్న అందరికీ క ల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రూ.లక్ష ఇస్తున్నామన్నారు. ‘నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన’కు అన్న పరిస్థితి నుంచి ‘నేను సర్కార్ దవఖానకే పోతా’ అనే స్థాయికి మార్చామన్నారు. డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ హబ్లు ప్రారంభమయ్యాయన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతం, జనహితమే అభిమతంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ రాష్ర్టానికి కులం, మతం పిచ్చోళ్లు వ ద్దు.. అభివృద్ధి, సంక్షే మం, పంచాయితీ లు లేకుం డా పచ్చగా ఉండే పరిస్థితులు కావాలి.. అభాగ్యులకు ఆసరా, పేదలకు సొంతిళ్లు ఉండాలి.. రైతులను ఆదుకునే ప్రభుత్వం కా వాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరెన్ని కారుకూతలు కూసినా పట్టించుకోవద్దని కోరారు. రైతుబంధు, రైతుబీమా, ని రంతర విద్యుత్, గురుకులాలు, ఆసరా పింఛన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పల్లె, పట్టణ ప్రగతి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్.. ఇలా ఎన్నో పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.
కృష్ణా జలాల వాటాను తేల్చకుండా కేంద్రం ఇబ్బంది పెడుతున్నదన్నారు. అంతకు ముందు మంత్రులు సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ రాములు, విప్ గు వ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మందా జగన్నాథ్, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్మన్లు పద్మావతి, లోకనాథ్రెడ్డి, సరిత, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా డైరెక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, వాల్యానాయక్, బాలాజి, మున్సిపల్ చైర్పర్సన్లు విజయలక్ష్మి, కల్పన, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, టీఆర్ఎస్ నాయకులు బైకని శ్రీనివాస్యాదవ్, జక్కా రఘునందన్రెడ్డి తదితరులు ఉన్నారు.
కృష్ణా జలాలను పారించడమే లక్ష్యం
పంట పొలాల్లో కృష్ణా జలాలను పారించడమే లక్ష్యంగా మార్కండేయ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాం. జిల్లాలో ఎంజీకేఎల్ఐ ద్వారా 75 వేల ఎకరాలకు సాగునీరందుతున్నది. కానీ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల బిజినేపల్లి మండలంలో ఎంజీకేఎల్ఐ కాల్వ ప్రవహిస్తున్నా.. కొన్ని గ్రామాలకు సాగునీరు అందలేదు. 480 మీటర్ల ఎత్తులో ఉండడం వల్లే బిజినేపల్లి మండలంలోని 17 గిరిజన తండాలు, ఐదు గ్రామాల రైతులు ఇబ్బందులు పడ్డారు. గిరిజన రైతుల బాధలు తీర్చేందుకే రూ.77 కోట్లతో మార్కండేయ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశాం. ఆరు నెలల్లోగా లిఫ్ట్ను పూర్తి చేసి 7,200 ఎకరాలకు సాగునీరందిస్తాం. నియోజకవర్గంలో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారని, వారికి ఉపాధి కోసం రెండు, మూడు పరిశ్రమలను నెలకొల్పాలని, గిరిజన తండాలకు రూ.పది కోట్లతో సీసీ రోడ్లకు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ను కోరాను. పట్టణంలో పార్కు, క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
– మర్రి జనార్దన్రెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే
కాంగ్రెస్పై పిట్టకథ..
కాంగ్రెస్ పార్టీ గురించి మంత్రి కేటీఆర్ చెప్పిన కథ అందరినీ ఆకట్టుకున్నది. ఆయన మాటల్లోనే ‘కొల్లాపూర్ వంటి పట్టణం లో వెనుకటికి ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. చదువు అబ్బలేదు. చిన్నప్పటి నుంచే చెడు దోస్తానాలు, సావాసాలు. గుట్కా, తంబాకు అలవాటున సదువక పో యేవాడు. తాగుడుకు బానిసై 17 ఏండ్లకు చేరుకున్నాడు. తాగుడుకో సం నాన్న జేబుల పైసలు తీసుకుంటుంటే అమ్మ జూసి చెంప చెల్లుమనిపించి బుద్దిలేదా.. సొంత ఇంట్లో దొంగతనం చేస్తవా అని తిట్టింది. మ ద్యం మత్తులో తల్లిని రోకలి బండతో కొట్టి చంపిండు. ఇది తండ్రి చూసి కొడుకును గట్టిగ రెండు కొడితే ఆవేశంలో తండ్రినీ చంపిండు.. పోలీసు లు వాడిని పట్టుకుపోయి జడ్జి ముందట పెట్టిండ్రు.. ఆ జడ్జిగారు నిరంజన్ రెడ్డిలాగ పెద్ద మనిషి. ఆ పిల్లోడిని చూసి జడ్జి ఇలా అన్నడంట.. ఒరేయ్ నా జీవితంలో చాలా మంది దరిద్రులు, చెత్త వెధవలు, లుచ్చాగాళ్లు, గలీజుగాళ్లను చూసిన.. గానీ నిన్ను చూసినంక నాకేం ఆలోచన వస్తలేదు.. నీకేం శిక్ష వేయాలో అర్థంకావడం లేదు.. చెప్పు అంటే అప్పటిదాక రొమ్మిరుసుకొని నిలబడ్డ పిల్లాడు.. ఏక్ధం రెండు చేతులు కట్టుకొని, నక్క వినయాలు చేసుకుంట తల్లిదండ్రులు లేని అనాథను.. నన్ను విడిచి పెట్టండి అని అన్నాడంట..’ గట్ల ఉంది కాంగ్రెస్ పరిస్థితి.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అని వేడుకోవడం చూస్తుంటే.. తల్లిదండ్రులను చంపిన వాడే వచ్చి అనాథనయ్యా వదిలిపెట్టండన్నట్లు ఉందని, హంతకులే సంతాపం తెలిపినట్లు లేదా కాంగ్రెస్ పరిస్థితి అని ప్రశ్నించారు.
దేశమంతా కేసీఆర్ కావాలంటున్నది..
దేశం బాగుండాలని ఆలోచించే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమే. అందుకే దే శానికి కేసీఆర్ వంటి నాయకుడు కావాలని అందరూ కోరుతున్నారు. దేశమంతా ఈ అంశంపై చర్చ జరుగుతున్నది. కేంద్రం తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్న ది. కేంద్రానికి మనం చెల్లించే పన్నుల్లో సగం కూడా తిరిగి ఇవ్వడం లేదు. పాలమూరు ప్రజలను లేబర్గా మార్చిన ఘన త గత సమైక్య పాలకులదైతే.. వలసలు రూపుమాపడం సీఎం కేసీఆర్ సర్కార్ది. రెండు జాతీయ పార్టీలకు చెందిన నాయకుల్లో ఒకాయనకు కులం పి చ్చి, మరొకాయనకు మతం పిచ్చి పట్టుకున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు పల్లెల్లో రూ.3 లక్షలకు ఎకరా ఉంటే.. ఇప్పుడు రూ. 2కోట్లకు చేరుకున్నది. తెలంగాణ ఏర్పాటుతో ఊహించని విధంగా భూ ముల ధరలు పెరిగి ధనవంతులుగా మారారు. టీఆర్ఎస్ స్థాపించకుంటే తెలంగాణ వచ్చేది కాదు. కొల్లాపూర్.. పది మందికి అన్నం పెడుతున్నది. ఉమ్మడి పాలమూరుకు తాగు, సాగునీరు అందిస్తున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశమంతా గర్వించేలా యాదాద్రి నిర్మాణం చేపట్టాం. ఒక్క గుడి కట్టకపోయినా ప్రతిపక్షాలు మతం పేరిట రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి నాయకులు, పార్టీలు అవసరమా అనేది ప్రజలు ఆలోచించాలి. నాటి నాయకులు పాలమూరు జిల్లాను లేబర్కు అడ్డాగా చేస్తే.. నేడు సీఎం కేసీఆర్ బతుకుదెరువు చూపించేలా చేశారు.
– శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి
మోడీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు
‘నరేంద్రమోదీ ప్రభుత్వం రాకముందు మిత్రోం, భాయియోం, బహెనో.. ఆప్ సబీ లోగ్. జన్ ధన్ ఖాతా ఖోలో మై ధన్ధన్ పంద్రాలాఖ్ ఇస్తా అన్నడు, నల్లధనం తెస్తా.. స్విస్ బ్యాంకులో నుంచి తెస్తా అన్నడు. ఏదయ్యా మోదీ నల్లధనమంటే తెల్లమొఖం వేసుకొని తిరుగుతుండు.. మాటల్లేవ్. బీహార్లో దాస్ గారని పెద్ద మనిషి బ్యాంక్ వాళ్లు తప్పు చేస్తే రూ.6 లక్షలు ఆయన ఖాతాలో వచ్చినయ్. బ్యాంకోళ్లు వచ్చి తప్పు జరిగింది.. పొరపాటున డబ్బులు పడ్డాయన్నరు.. అయితే ఆ డబ్బులతో దాస్ ఇల్లు కట్టుకోవడం ప్రారంభించిండు.. ఇది చూసి బ్యాంకోళ్లు మా డబ్బు ఇయ్యండంటే.. లేదు లేదు మోడీ పంపిండు.. నాకే మోదీ రూ.9 లక్షలు బాకీ ఉన్నడని చెప్పిండు.. అట్లునయ్ పీఎం మోదీ మాటలని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు కొల్లాపూర్ ప్రజలే పోయి ఆ పంచాయితీ తెంపాలె అని మంత్రి వేసిన సెటైర్లకు జనం చప్పట్లు కొట్టారు.
వేల ఎకరాలు సాగులోకి..
తెలంగాణ వచ్చాక కొల్లాపూర్లో బీమా కింద 48 వేల ఎకరాలు సాగు అవుతున్నా యి. 2014 కంటే ముందు కేవలం ఎల్లూరు లిఫ్ట్తో 12 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందేది. నేడు జొ న్నలబొగుడ రిజర్వాయర్ పూర్తయ్యా క 52 వేల ఎకరాలకు నీరందుతున్నది. గుడిపల్లి రిజర్వాయర్ నుంచి పెద్దకొత్తపల్లికి నీరు పారుతున్నది. చిన్నంబావి, వీపనగండ్లలో 25 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. సిం గోటం నుంచి నీళ్లు తరలిస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్ను ఒప్పించి.. సింగోటం-గోపల్దిన్నె లింక్ కెనాల్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పాలెంలో పదో తరగతి చదువుతున్న సమయంలో.. కొల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో భగవాన్ దాస్ సార్ వద్దకు వస్తే కనీసం తాగునీరు ఇవ్వలేని దుస్థితి ఉండేది. కానీ నేడు అదే కొల్లాపూర్ నుంచి ఉమ్మడి పాలమూరులోని 11 నియోజకవర్గాలు, రంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్లోని నాలుగు నియోజకవర్గాలకు ఎల్లూరు నుంచి తాగునీరందుతున్నది. కొల్లాపూర్ మామిడికి రుచి, నాణ్యతలో ఎంతో పేరు ఉన్నది. మరింత పేరు తీసుకురావాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మామిడి మార్కెట్ను మంజూరు చేశారు. పంటకు ధర కల్పించే రెగ్యులేటరీ ఏర్పాటు చేయించుకోవాలి.
– సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
చాలా సంతోషంగా ఉన్నది..
నాడు చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లోని చివరి ఆయకట్టుకు నీళ్లు రాక ధర్నాలు చేసే పరిస్థితులు ఉండేవి. మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో.. సీఎం కేసీఆర్ను కోరగా రూ.147 కోట్లతో లింక్ కెనాల్ను మంజూరు చేశారు. మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మాకు ప్రేమ పంచడం మాత్రమే తెలుసు. కొట్లాడటం చేతకాదు. జాతీయ రహదారి, సోమశిల-సిద్ధేశ్వరం వంతెన మంత్రి కేటీఆర్ వల్లే సాధ్యమైంది. కోన్ పూచ్తా కొల్లాపూర్ అనే పరిస్థితి నుంచి కహాహై కొల్లాపూర్ అనే స్థాయికి తీసుకొచ్చాం. కల్వకుర్తి ఆయకట్టు కింద బాచారం హై లెవల్ కెనాల్ నిర్మించడానికి రూ.104 కోట్లతో జొన్నలబొగుడ నుంచి నీళ్లు తీసుకెళ్తే 15 వేల ఎకరాలకు, చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తే మరో 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కృష్ణాతీరంలో ముదిరాజ్ల కోసం ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ మార్కెట్ ఏర్పాటు చేయాలి. శ్రీశైలం నిర్వాసితులకు 98 జీవో ప్రకారం 97 మందికి ఉద్యోగాలు కల్పించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు. రాష్ట్రంలో త్వరలో నియమించే 7 వేల లష్కర్ పోస్టుల్లో నిర్వాసితులకు అవకాశం కల్పించాలి. ఇక్కడ వెదురు బాగా దొరుకుతున్నందున పేపర్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి. సోమశిలకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. అమరగిరిలో ఎకో టూరిజానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ను కోరగా సానుకూలంగా స్పందించారు.
– బీరం హర్షవర్ధన్రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే