తాడూరు, ఏప్రిల్ 18 : పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య వైద్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని మౌలిక వసతులతో పాఠశాలలకు నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఎంపీ రాములుతోకలిసి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తన సొంత డబ్బులతో తిమ్మాజిపేట, తాడూరు, సిర్సవాడ గ్రామాల్లోని పాఠశాలలకు అత్యాధునిక వసతులతో భవనాలు నిర్మించి పేద ప్రజలకు అందివ్వడం మన అదృష్టమన్నారు. ప్ర పంచంలో ఎంతోమంది కోటీశ్వరులు, లక్షాధికారులు ఉన్నారు. కానీ ఎమ్మెల్యే మర్రి తాను సంపాదించిన డబ్బులో కొంత పేదల కోసం ఖర్చు పెడుతున్నాడని ఇలాంటివారి సేవలను ప్రజలు ఎప్పుడూ మరిచిపోరని చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా మంది నిరుపేదకుటుంబాల్లోని విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారన్నారు.
కానీ గత కొన్నేళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరడంతో పాఠశాలల్లో సరైన వసతులు లేక చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చే రేందుకు ఇష్టపడటం లేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంజేఆర్ ట్రస్టు ద్వారా విద్యార్థుల కోసం ఆధునిక హంగులతో పాఠశాల భవనానాలు నిర్మించనున్నట్లు తెలిపారు. తాను సిర్సవాడ పాఠశాలల్లో చదువుకున్నానని ఆ పాఠశాల కూడా శిథిలావస్థకు చేరడంతో తాడూరు, సిర్సవాడ గ్రామాల్లోని పాఠశాల భవనాలను పునర్నిర్మిస్తున్నామని, వచ్చే విద్యాసంవత్సం నాటికి నిర్మాణాలు పూ ర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మె ల్యే తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో నాగలక్ష్మి, డీఈవో గోవిందరాజులు, తాసిల్దార్ కార్తీక్, ఎంపీడీవో గంగమోహన్, సర్పంచ్ అనుపటి యాద మ్మ శ్రీనివాసులు, గ్రంథాలయ చైర్మన్ హనుమంతురావు, ఎంపీపీ గుర్రాల శ్రీదేవి, వైస్ ఎంపీపీ శివలీల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యారరమేశ్, నాయకు లు తిరుపతిరెడ్డి, పరమేశ్వర్రెడ్డి, మార్కెట్యార్డు వైస్ చైర్మన్ జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.