నవాబ్పేట, ఏప్రిల్ 29: మండలంలోని లోకిరేవు గ్రా మంలో సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగంపై సీడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంస్థ ప్రతినిధులు హాజరై ఎరు వుల తయారీపై అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో ఎరువులు తయారు చేసుకొని మంచి దిగుబడి సాధించవచ్చని తెలిపారు. రసాయనిక ఎరువుల విని యోగం తగ్గించి రైతులు సేంద్రియ పద్ధ్దతులు పా టించాలని కోరారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ మాణిక్యం, సంస్థ ప్రతినిధులు పుష్ప, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.