కోడేరు, ఏప్రిల్ 27: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధ్దన్రెడ్డి పేర్కొన్నారు. కోడేరు, జనుంపల్లి గ్రామాల్లో వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కష్టాలను చూసిన సీఎం కేసీఆర్ రాష్ట్రవాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విండో చైర్మన్ చిన్నారెడ్డి, కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్చైర్మన్ కుర్మయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, విండో డైరెక్టర్లు జగన్మోహన్రెడ్డి, నర్సింహారెడ్డి, కృష్ణయ్య, సర్పంచులు వెంకటస్వామి, సత్యనారాయణ, టీఆర్ఎస్ జిల్లా ఎస్టీసెల్ నాయకులు కిషన్నాయక్, సీఈవో జయప్రకాశ్రెడ్డి, సిబ్బంది ఖాజ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పరిశీలన
కోడేరు పీహెచ్సీ, సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణకు సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పీహెచ్సీని సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై వైద్యుడు రాజశేఖర్ను ఆరా తీశారు. కరోనా దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం అనారోగ్యంతో మృతిచెందిన బోయనిరంజన్, విలేకరి కృష్ణ మాతృమూర్తి శాంతమ్మ కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, నాయకులు పవన్కుమార్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ వెంకటస్వామి, కుర్మయ్య తదితరులు ఉన్నారు.