తప్పుడు గుర్తింపుకార్డులతో రోడ్లపై తిరిగితే కేసులు నమోదు
ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 20 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న లాక్డౌన్ నిబంధనలను ప్రతిఒక్క రూ పాటించాలని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. గు రువారం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ పరిస్థితిని పర్యవేక్షించారు. క్లాక్టవర్లో రోడ్లపై తిరుగుతున్న వా హనదారుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తప్పుడు గుర్తింపు కార్డు పెట్టుకుని తిరుగుతున్న యువకుడిని గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి అతడిపై కేసు నమోదు చే యాలని వన్టౌన్ ఇన్స్పెక్టర్ను ఎస్పీ ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తప్పుడు గుర్తింపు కార్డులతో లాక్డౌన్ సమయంలో బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దుకాణాల ముందు ప్రజలు గుమ్మికూడకుండా దుకాణాదారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. లాక్డౌన్, కొవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా 4742మందిపై కేసులు న మోదు చేశామని, ఇకముందు మరింత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలి
నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసు అధికారులతో ఎస్పీ సమావేశమై శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ కరోనా మహమ్మారి ని ర్మూలనకు పూర్తిస్థాయిలో శ్రద్ధ తీ సుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. పోలీసు సిబ్బంది వ్యక్తిగతంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కనిపించని శత్రువు పై ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉంటూనే ప్రజల రక్షణ బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. లాక్డౌన్ ఉద్దేశాన్ని చాలావరకు ప్రజలు ఆర్థం చే సుకుని ఇండ్లల్లోనే ఉంటున్నారని, సడలింపు సమయంలో అనవసరంగా బయట తిరుగుతూ రద్దీ సృష్టించేవారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రధానంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిందితులను అదుపులోకి తీసుకునే ప్రక్రియలో ఏమరుపాటు తగదని సూచించారు. దర్యాప్తులో ఉన్న పాత నేరాల్లో పురోగతి సాధించేందుకు కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆనాచారాలు, చిన్నచిన్న గొడవలు, యువత దురాలవాట్లపై ప్రాథమిక స్థాయిలోనే చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు సిబ్బంది కు టుంబ సభ్యులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్పీ ఎన్ వెంకటేశ్వ ర్లు, డీఎస్పీ శ్రీధర్ తదితరులు ఉన్నారు.