ఊట్కూర్, మే 19 : కరోనా వైరస్ నివారణకు ప్రతిఒ క్కరూ సహకరించాలని తాసిల్దార్ తిరుపతయ్య అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో బుధవారం మండల కేంద్రంతో పా టు పరిసర గ్రామాలను ఆయన సందర్శించారు. పని లేనివారు ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీదకు రావద్దని ప్రజలకు సూచించారు. నెల రోజులపాటు వ్యాధి తీవ్రత అధికంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు నిర్లక్ష్య ధోరణి వీడి తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తప్పనిసరైతేనే ఇంటి నుంచి బయటికి వచ్చే ప్రతిఒక్కరూ మాస్కును ధరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు, జరిమానాలు తప్పవని హెచ్చరించారు. మండల కేంద్రంలో సంత బజార్ను సందర్శించి వ్యాపారులు ఉదయం 10 గంటలవరకే వ్యాపార లావాదేవీలు ముగించుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.
నివారణకు పటిష్ట చర్యలు
కృష్ణ, మే 19 : మండలంలోని చేగుంట, ఆలంపల్లి, గు డెబల్లూర్ గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కా వడంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఆయా గ్రామాల స ర్పంచులు పటిష్ట చర్యలు చేపట్టారు. బుధవారం సోడి యం హైపోక్లోరైట్ ద్రావణాన్ని గ్రామ పంచాయితీ సిబ్బందితో పిచికారీ చేయించారు. మురుగు కాలువల్లో పూడికతీత వంటి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పు డు మాస్కులు ధరించాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వా ర్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్లన్నీ ఖాళీ
దామరగిద్ద, మే 19 : లాక్డౌన్తో మండంలోని అన్ని గ్రామాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారా యి. ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించడంతో ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన ఉదయం 10 గంటలలోపు వారి పనులు ముగించుకొని వారి వారి ఇండ్లకు చేరుతున్నారు. అత్యంత అవసరమైన వారు తప్ప ఇంటి నుంచి బయటికి రావడం లేదు. మండంలోని వ్యాపార సంస్థలన్నీ మూసి ఉండటంతో ఎవరూ బయటకి రావడం లే దు. వ్యవసాయ పనులకు వరి పంటలు కో సిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకు పోవడం మినహా మిగతా వా రు ఎవరూ బయటికి రావడం లేదు. పరిస్థితిని పోలీసులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు.
కొనసాగుతున్న లాక్డౌన్
మరికల్, మే 19 : తెలంగాణ ప్రభు త్వం కరోనా వైరస్ కట్టడి కోసం చేపట్టిన లాక్డౌన్ పటిష్టంగా కొనసాగుతున్నది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు జనం రోడ్ల పైకి వచ్చి తమకు కావలసిన నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. 10 గంటల తర్వాత ఎవరూ రోడ్డుపైకి రాకుండా మరికల్ ఎస్సై నాజర్ ఆధ్వర్యంలో పోలీసులు లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
నిబంధనలు పాటించకపోతే చర్యలు
బాలానగర్, మే 19 : లాక్డౌన్ నిబంధనలను విస్మరిస్తే చర్యలు తప్పవని ట్రైనీ ఎస్సై మధు అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని జాతీయ రహదారి వాహనాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 8మందికి జరిమానా విధించినట్లు తెలిపారు. అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడకూడదని సూచించారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని కోరారు. ఆయ న వెంట కానిస్టేబులు రాంచందర్, యాదిగిరిగౌడ్ తదితరులు ఉన్నారు.