లాక్డౌన్తో పాలమూరు నిర్మానుష్యం
బోసిపోయిన రహదారులు
మూతపడిన దుకాణాలు
మహబూబ్నగర్/మెట్టుగడ్డ, మే 13 : లాక్డౌన్ అమలులోకి రావడంతో రహదారులు నిర్మానుష్యంగా మారా యి. మినహాయింపు వేళల్లో రద్దీగా కనిపించినా 10గంటల తర్వాత వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డా యి. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు.
పోలీసు పహారా
జడ్చర్లటౌన్, మే 13 : లాక్డౌన్లో భాగంగా జడ్చర్లలో పోలీసులు గురువారం బందోబస్తు నిర్వహించారు. పట్టణంలో అన్ని ప్రాంతాల్లో గస్తీ చేపడుతూ వ్యాపార సముదాయాలను మూసివేయించారు. జడ్చర్ల సీఐ వీరాస్వామి, ఎస్సై శంషొద్దీన్ నేతృత్వంలో పర్యవేక్షణ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పట్టణంలోని నేతాజీ చౌరస్తా రహదారిపై ఆటోలు, వాహనదారుల రద్దీ కనిపించింది. కిరాణం,కూరగాయల దుకాణాల వద్ద జనం క్యూకట్టారు. 10 గంటల తర్వాత పెట్రోలింగ్ చేస్తూ దుకాణాలను మూసివేయించారు.
అప్రమత్తమవుదాం..
కరోనాపై అందరం అప్రమత్తమై కరోనాను సమిష్టిగా అరికడుదామంటూ అధికారులతోపాటు కౌన్సిలర్లు వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. 3,5వ వార్డుల్లో చైర్పర్సన్ దోరెపల్లి లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సునీత, కౌన్సిలర్లు సతీశ్, నవనీతలతో కలసి శానిటైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 9వ వార్డులో కౌన్సిలర్ చైతన్యతో కలసి మున్సిపల్ చైర్పర్సన్ పర్యటించారు. 11వ వార్డు కౌన్సిలర్ బి. జ్యోతి వార్డులో తిరిగి హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 25వ వార్డు కౌన్సిలర్ లత వార్డులో శానిటైజేషన్తో పాటు మున్సిపల్ సిబ్బంది చేత బ్లీచింగ్ పౌడర్ను చల్లించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు
మూసాపేట, మే13: లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్క రూ పాటించాలని, అతిక్రమించే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయకతప్పదని భూత్పూర్ సీఐ రజితారెడ్డి సూచించారు. గురువారం మూసాపేట మండల కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సంరద్భంగా ఎస్సై పర్వతాలుతో మండలంలో లాక్డౌన్ అమలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసమే లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ సమయంలో స్వీయ నిర్బంధంలోనే ఉండాలని, గడప దాటి ఎవరూ బయటకు రావొద్దని సీఐ కోరారు.