ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కళాశాల మంజూరు : ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి
నాగర్కర్నూల్, జూన్ 4 : నాగర్కర్నూల్ జిల్లా కేం ద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చడమే లక్ష్యమని ఎమ్మె ల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నాగర్కర్నూల్లో నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటప్రకారం మెడికల్ కళాశాలను మంజూ రు చేయడం హర్షణీయమన్నారు. మంత్రిస్థాయిలో ఉన్న నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో అంతకుమించి నాగర్కర్నూల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. త్వరలోనే ఈ ప్రాంతాన్ని పారిశ్రామికవాడగా మార్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా వైద్య, విద్యా రంగాలను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అలాగే నాగర్కర్నూల్ దవాఖానలో అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. రైతులకు సమృద్ధిగా సాగునీటిని అందించేందుకు బిజినేపల్లి మండలంలో మార్కండేయ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో రైతుబజార్, మాంసం మా ర్కెట్లను వేర్వేరుగా ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్గౌడ్, వైస్చైర్మన్ బాబూరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్రెడ్డి, జెడ్పీటీసీ శ్రీశైలం, బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్గౌడ్ తదితరులు ఉన్నారు.