తిమ్మాజిపేట: తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లిలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదివారం రాత్రి అకస్మిక పర్యటన జరి పారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మమేకం అయ్యారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులను, మహిళలను ఆప్యాయంగా పలు కరించారు. పింఛన్లు వస్తున్నాయా అని, కొత్త వాటికి ధరఖాస్తు చేసుకున్నారా అని ఆరా తీశారు.
ప్రభుత్వ పథకాల అమలు తెలుసుకున్నారు. ఇటీవల ఆనారోగ్యానికి గురైన వారికి సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు మంజురూ చేయించిన ఆయన వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలసుకున్నారు. గ్రామంలో కావల్సిన వసతుల గురించి స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
ఎమ్మెల్యే గ్రామానికి రావడంతో యువకులు, చిన్నారులు ఆయన వెంట తిరిగారు ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకు న్నారు. ఆయన వెంట ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వేణు గోపాల్గౌడ్, రైతుబంధు కన్వీనర్ వెంకటస్వామి, మార్కెట్ డైరక్టర్ హుస్సేనీ, పార్టీ ప్రధాన కార్యదర్శి జైపాల్రెడ్డి, స్వామి, నర్సిరెడ్డి, ప్రకాశ్ తదితరులు ఉన్నారు.