నాగర్కర్నూల్ : జిల్లా పర్యనటలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ షెడ్, చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభోత్సం చేశారు. కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు టి. ఆచారి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీటీసీ విజితా రెడ్డి, గ్రామ సర్పంచ్ శారదమ్మ తదితరులు పాల్గొన్నారు.