నాగర్కర్నూల్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : మాతా శిశు మరణాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు పీహెచ్సీల్లోనూ 24 గంటల సేవలు అందిస్తున్నది. రోగులకు కావాల్సిన మం దులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతున్నది. ఇక పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి వైద్య సేవలను మరింత దగ్గర చేస్తున్నది. జి ల్లా, ఏరియా, కమ్యూనిటీ దవాఖానలతోపాటు పీ హెచ్సీల్లోనూ కాన్పులు చేయించేలా చర్యలు తీసుకున్నది. మాతాశిశు మరణాలను అరికట్టేందుకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్ర భుత్వ దవాఖానలో కాన్పు జరిగితే కేసీఆర్ కిట్ అందజేస్తున్నది. మగపిల్లాడు పుడితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13వేలు ఇస్తున్నది.
దీం తో కాన్పుల కోసం ప్రభుత్వ దవాఖానల వైపు మొగ్గు చూపుతున్నారు. పేదలతోపాటు ధనికులు సైతం సర్కార్ దవాఖానాలకే ప్రాధాన్యత ఇస్తుండడం కొసమెరుపు. ప్రైవేట్ దవాఖానల్లో సిజేరియన్కే ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు రూ.25వేల నుంచి రు.40వేలకుపైగా ఫీజు వసూలు చేస్తున్నా రు. దీంతో ఉచితంగా, నమ్మకంతో కూడిన ప్రభు త్వ దవాఖానల్లోనే కాన్పులు చేయించుకునేందు కు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇదిలాఉంటే ప్రభు త్వ దవాఖానల్లో సాధారణ కాన్పులను పెంచేందుకు తాజాగా రూ.3వేల నగదు కూడా అందించనున్నట్లుగా నిర్ణయించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చేసిన ప్రకటించారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్య శాఖ ఈ నెల 4న మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం రూ.3వేల నగదులో రూ.1000 డాక్టర్లకు, స్టాఫ్నర్స్, మిడ్వైఫ్, ఏఎన్ఎంలకు రూ.1000, శానిటేషన్ వర్కర్లకు రూ.500 చొప్పున ఇవ్వనున్నారు.
ఇందులో సబ్ సెంటర్లలోని ఏఎన్ఎంకు రూ.250, ఆశవర్కర్లకు రూ.250 చొప్పున ఇస్తారు. దవాఖానల కు కేటాయించిన 85 శాతం సాధారణ కాన్పుల లక్ష్యాన్ని చేరుకుంటేనే ఈ ప్రోత్సాహం అందించే లా నిబంధన విధించారు. ప్రతి నెలలో జరిగిన కా న్పులను పరిగణలోకి తీసుకోనున్నట్లు మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం మెడికల్ క ళాశాల అనుబంధ దవాఖానల్లో ప్రతి నెలా 350 సాధారణ కాన్పులు, జిల్లా దవాఖానల్లో 250, ఏరియా దవాఖానల్లో 150, సీహెచ్సీల్లో 50, 24 గంటల పీహెచ్సీల్లో 10 కాన్పులు, ప్రైమరీ హెల్త్ సెంటర్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 5 కా న్పులు చేయాల్సి ఉంటుంది. ఇలా నిర్దేశించిన ల క్ష్యంలో 5 శాతం చేరుకుంటే రూ.3వేల నగదు ప్రోత్సాహం అందనున్నది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హర్షం వ్యక్తమవుతున్నది.
నాగర్కర్నూల్ జిల్లాలో 2016 నుంచి 2002 ఆగస్టు వరకు 61,251 కాన్పులు జరిగాయి. ఇందులో ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు 22,806, సిజేరియన్లు 12,386 జరిగాయి. ప్రైవేట్ దవాఖానల్లో కేవలం 5,806 సాధారణ కాన్పులు జరిగితే.. 20,253 సిజేరియన్లు జరిగాయి. ఇలా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు 28,612, సిజేరియన్లు 32,639 జరిగాయి. ప్రభుత్వ దవాఖానల్లో 2016లో 1,153 సాధారణ కాన్పులు ఉంటే.. 2020లో అత్యధికంగా 4,098 కాన్పులు జరిగాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికే 2,261 కాన్పులు జరగడం గమనార్హం. ఇక ప్రైవేట్లో మాత్రం శస్త్రచికిత్సలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందులో ప్రభుత్వ దవాఖానల్లోని సాధారణ ప్రసవాలతో సమానంగా.. ప్రైవేట్ దవాఖానల్లో 20,253 సిజేరియన్లు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. ఈ కారణంగా ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులకే మొగ్గు చూపుతున్నారు.
సాధారణ కాన్పులు పెంచేలా చర్యలు..
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు పెంచేందుకు ప్రభుత్వం పలు రకాల చర్యలు, పథకాలు అమలు చేస్తున్నది. ఇప్పటికే కేసీఆర్కిట్తోపాటు వైద్య పరీక్షలు, చికిత్సలు, అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఉచితంగా అందిస్తున్నది. అన్ని దవాఖానల్లో కాన్పులు జరిగేలా ఏర్పాట్లు చేపట్టాం. దీంతో సాధారణ కాన్పుల కోసం ప్రభుత్వ దవాఖానలకు అధికంగా వస్తున్నారు. ఈ కాన్పులను పెంచేందుకు వైద్య సిబ్బందికి రూ.3వేలు ఇచ్చి ప్రోత్సహించేందుకు నిర్ణయించడం చాలా సంతోషకరం. వైద్య సిబ్బందిలో మరింత ఉత్సాహం వస్తుంది.
– సుధాకర్లాల్, డీఎంహెచ్వో, నాగర్కర్నూల్