నాగర్కర్నూల్ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని బిజినపల్లి మండలంలోని వట్టెం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎరుకలి కురుమూర్తి, పదుమ ప్రవీణ్, చెన్నయ్య, రాము, నీళ్ల నరేష్, గంజి శ్రీను, ఇడ్ల శివ, పద్మ రాములు, జే.శివ, గంజి హన్మంతు, పద్మ కృష్ణ, తదితరులు ఉన్నారు.