నాగర్కర్నూల్ : బెడ్ పై నుంచి ప్రమాదవశాత్తు ఓ విద్యార్థిని కిందపడటంతో కాలు విరిగింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన విద్యార్థి గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. కాగా, బుధవారం మధ్యరాత్రి కడుపు నొప్పి రావడంతో దొర్లుతూ కిందపడింది.
మంచానికి సేఫ్టీ పైపులు లేకపోవడంతో కింద పడినట్లు సదరు విద్యార్థి స్వయంగా పేర్కొంది.
దీంతో విద్యార్థికి కుడి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది మహబూబ్నగర్ దవాఖానకు తరలించారు. అయితే విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసుకున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్న ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి తెలిపారు.