ప్రసిద్ధ వాగ్గేయకారులు, ప్రజాకవి, శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. తాజాగా గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్.. అవార్డును ప్రదానం చేశారు. వల్లంకి తాళం కవితా సంపుటికి గోరటి వెంకన్నకు అవార్డు వరించింది. 32 గేయరూప కవితలతో వల్లంకి తాళం అనే కవితా సంపుటి వెలువడింది.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ చేతుల మీదుగా గోరటి వెంకన్న అందుకున్నారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కారాన్ని ప్రకటించారు.