నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో
15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుచరుడు ఇద్దరు యువతులను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించాడు. కాంగ్రెస్ నాయకుల కుట్రలను పసిగట్టిన బీఆర్ఎస్ నాయకులు దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన యువతులను అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరగడంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అధికార పార్టీకి అండగా నిలిచిన పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి 15, 14 వార్డులతో పాటు మరికొన్ని వార్డులలో దొంగ ఓట్ల వేయించేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు, మద్యంతో ఓటర్లను కాంగ్రెస్ నాయకులు ప్రలోబాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.