కల్వకుర్తి రూరల్, జనవరి 19: అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని అమ లు చేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రఘుపతిపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఆధ్యక్షతన గురువారం నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా వైద్య సిబ్బంది, అధికారులు చేసిన ఏర్పాట్లు, వసతులు, కళ్లద్దాలు, వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 2018ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో దృష్టి లోపాలను నివారించేందుకు తొలి విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశారని, తిరిగి మళ్లీ ఇప్పుడు కంటి వెలుగు రెండో విడుతను ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేశారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు అం దజేశామన్నారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నారని వివరించారు.
కంటి వెలుగు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, పథకం పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కల్వకుర్తి పట్టణంలో కంటి పరీక్షా కేంద్రాన్ని డీఎంహెచ్వో సుధాకర్లాల్, నోడల్ ఆఫీసర్ రవికుమార్ పరిశీలించి వైద్య సిబ్బంది, అధికారులకు పలు సలహాలు చేశారు. అదేవిధంగా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రా మంలో ఎంపీపీ సామ మనోహర, సర్పం చ్ రేణుక, నాయకులు తోటపల్లి గ్రామం లో సర్పంచ్ శ్రీలత, ఎంపీటీసీ రవీందర్రెడ్డి, నాయకులు హాజరై కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షాహేద్, కౌన్సిలర్లు రాచోటి శ్రీశైలం, బాలునాయక్, సూర్యప్రకాశ్రావు, మంజుల, యాదమ్మ, మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్కుమార్, ఎంపీడీవో విజయ్భాస్కర్, ఎంపీవో దేవేందర్, వైద్యులు జ్యోతి, రమ్య, హరిప్రియ, భాగ్యలక్ష్మి, నాయకులు అధికారులు ఉన్నారు.
రూ.250 కోట్లతో రెండోవిడుత కంటివెలుగు
తెలంగాణ ప్రభుత్వం చూపు లేని వారికి చూపు ప్రసాదించేందుకు, కంటి సమస్యలున్నవారికి ఉచితంగా చికిత్స చేసేందుకు చేపట్టిన కంటి వెలుగు పథకంతో ప్రజల జీవితాల్లో నిండు వెలుగు నిండనుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రెండో విడుత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని గురువారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోళి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రభుత్వం ప్రజల బాగోగులే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రూ. 250కోట్లతో కంటి వెలుగుకు శ్రీకారం చుట్టిందన్నారు. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడాలేదని తెలిపారు. వైద్యులు అందుబాటులో ఉండి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి, జెడ్పీటీసీ విజితారెడ్డి, ఎంపీపీ విజ య,వైస్ ఎంపీపీ గోపాల్నాయక్ రైతు బంధు సమితి మం డల అధ్యక్షుడు భాస్కర్రావు, సర్పంచులు దార్లకుమార్, రామకృష్ణ, బీరయ్య, జియాగూడ యాదవ సంఘం అధ్యక్షుడు జంగయ్యయాదవ్, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు తాటికొండ కృష్ణారెడ్డి, నాయకులు సంజీవ్కుమార్, యూత్ అధ్యక్షుడు యాదగిరి, రాము, ప్రసాద్, డాక్టర్ స్వరూప, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు సిబ్బంది ఉన్నారు.