అచ్చంపేట టౌన్: పట్టణంలోని 20వ వార్డులో లక్ష్మి థియేటర్ ప్రక్కన ఆదివారం రోడ్డు నిర్మాణ పనులకు విప్, గువ్వల బాలరాజు భూమి పూజ చేశారు. అనంతరం కౌన్సిలర్ రమేశ్రావు మాట్లాడుతూ 290మీటర్లు 30 లక్షలతో రోడ్డు నిర్మా ణ పనులు చేపట్టినట్లు తెలిపారు.
కార్యక్రమంలో చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్, వైస్ చైర్మన్ శైలజా రెడ్డి, మాజీ చైర్మన్ తులసీరాం, కౌన్సిలర్లు రమేశ్రావు, అంతటి శివ, గడ్డం రమేశ్, సోమ్లానాయక్, మన్నుపటేల్, తగరం శ్రీను, ఏఈ మేఘనాథ్ టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ఆకుల వెంకటేశ్, కందికొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.