నాగర్కర్నూల్, సెప్టెంబర్ 19: జిల్లాకేంద్రంలో ఆదివారం ఉదయం గణపతుల నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు చేసిన యువక బృందాల స భ్యులు శనివారం రాత్రి గణపయ్యను నిమజ్జనానికి తరలించారు. కాగా తెల్లవాళ్లు శోభాయాత్ర కొనసాగించి ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో పట్టణ శివారులోని నాగనూలు చెరువులో నిమజ్జనం చేశారు. షేర్ బ్యాండ్స్, డీజే సౌండ్స్, మిరుమిట్లు గొలిపే లైట్ల మధ్య ఉత్సవ కమిటీసభ్యులు నత్యాలు చేస్తూ గణపయ్యలను తరలించారు.
పోటాపోటీగా లడ్డూ వేలం..
రాంనగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యం లో నిర్వహించిన వేలంలో లడ్డూను రూ. 2లక్షల 1,116కు వినోద్ గుప్తా, హౌసింగ్ బోర్డులోని మైల్స్టోన్ గణపతి లడ్డూను రవి టీం సభ్యులు రూ.2లక్షల 16వేలకు పొందారు.
మర్రి జమున ప్రత్యేక పూజలు
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 19: జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సతీమణి మర్రి జమునరాణి ఆదివారం పూజలు చేశారు. పూజలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్గౌడ్, కౌన్సిలర్లు పద్మమ్మ, లలితమ్మ, విజయమ్మ, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
తెలకపల్లిలో..
తెలకపల్లి, సెప్టెంబర్ 19 : మండలంలోని తాళ్లపల్లిలో ఆదివారం నిర్వహించిన గణేశ్ నిమజ్జనంలో సర్పంచ్ పాల్గొని గణపతికి పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన వేలంలో గణపతి లడ్డూను వేలంలో తిరుపతయ్యగౌడ్ రూ.50వేలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీను, మాజీ ఎంపీపీ బండ పర్వతాలు, గ్రామస్తులున్నారు.
వెల్దండ మండలంలో..
వెల్దండ, సెప్టెంబర్ 19 : మండలంలోని వినాయక మండపాల వద్ద ఉట్లు కొట్టారు. పూజలందుకున్న లడ్డూకు వేలం నిర్వహించారు. కొలాటాలు, నృత్యాలతో విఘ్నేశ్వరుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
యత్మతాపూర్లో..
తాడూరు, సెప్టెంబర్ 19 : మండలంలోని యత్మతాపూర్లో వినాయకుని లడ్డూను వేలం లో రూ.లక్షా24వేల 999 ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి కైవసం చేసుకున్నారు.