వెల్దండ, జూన్ 15: ప్రజాప్రతినిధులు, అధికారులు కలికట్టుగా ముందుకు సాగుతూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీ రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం వెల్దండలో మండలసభ ఎంపీపీ విజయ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు శాఖల వారీగా సంక్షేమ, అభివృద్ధి నివేదికలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లి మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. ప్రస్తుతం వెల్దండ మండలంలోని 32జీపీల్లో రూ.3కోట్ల నిధులు జమచేసి ఉంచామన్నారు. ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపైనే ఉందన్నారు. గ్రామాల్లో ప్రతి సమావేశానికి ఎంపీటీసీలను ఆహ్వానించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎప్పటికప్పుడు చేసిన పనులకు అధికారులు బిల్లులు చేసి సర్పంచులకు భారం తగ్గించాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ విజాతారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి, వైస్ఎంపీపీ శాంతి, ఎంపీవో సునీత, తాసిల్దార్ వెంకట్మ్రణ, సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
ప్రొసిడింగ్లు అందజేత
వెల్దండ, జూన్ 15: పూర్వపు వెల్దండ మండలం జేపల్లి, చంద్రయాన్పల్లి గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం జెడ్పీవైస్ చైర్మన్ బాలాజీసింగ్ నిధులు కేటాయించారు. దీంతో మంగళవారం మండలకేంద్రంలో సంబంధిత పనులు చేసేందుకు ప్రొసిడింగ్లను ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ చేతుల మీదుగా కాంట్రాక్టర్లకు అందజేశారు. జేపల్లిలో డ్రైనేజీ పనులు, చంద్రయానిపల్లిలో రోడ్డు పనులను నాణ్యతగా సకాలంలో చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా బాలాజీసింగ్కు ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజితారెడ్డి, సర్పంచ్ భూపతిరెడ్డి, కోఆప్షన్ అలీం, యాదగిరి, సమీర్బాబా, శంకర్నాయక్, వీరన్న, రాములు తదితరులు ఉన్నారు.