నాగర్కర్నూల్, మే 22 : గొల్ల కురుమల జోలికొస్తే పాతరేస్తామని కురుమయాదవ సంఘం నాయకులు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డిని హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, గొల్లకురుమలను అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి తీరుకు నిరసనగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం నిరసన, ధర్నా చేపట్టారు. బస్టాండ్ చౌరస్తాలో రేవంత్రెడ్డి ఫ్లెక్సీని పేడతో కొట్టారు. వేలాది మందిగా తరలొచ్చిన గొల్లకురుమలతో కందనూలు పట్టణం దద్దరిల్లింది. యాదవుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈనెల 25వ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో గాంధీభవన్, రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా గొల్లకురుమలు ఓటుతో బుద్ధి చెబుతారన్నారు.ఇకనుంచైనా చిల్లరమాటలు మానుకోవాలని హితవుపలికారు.
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, గొల్లకురుమలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కురుమయాదవులు మండిపడ్డారు. గొల్లకురుమల జోలికొస్తే పాతరేస్తామని హెచ్చరించారు. మంత్రి తలసాని, గొల్లకురుమలను అవమానపరిచేలా రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కురుమయాదవ సంఘం రాష్ట్ర నాయకుడు బైకాని శ్రీనివాస్యాదవ్, జేఏసీ కన్వీనర్ కడారి అంజయ్యయాదవ్, నాయకులు గోసుల శ్రీనివాస్యాదవ్, లాలూయాదవ్, అయోధ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాంయాదవ్ మాట్లాడుతూ యాదవుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన రేవంత్రెడ్డి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 25వ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో గాంధీభవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. యాదవుల ముద్దుబిడ్డ తలసాని శ్రీనివాస్యాదవ్, మా జాతిని కించపరిచేవిధంగా మాట్లాడిన రేవంత్కు తగినబుద్ధి చెబుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో నిన్ను పాతరేసి మా గొల్లకురుమల సత్తా చూపిస్తామన్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి పేడకొట్టారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లాలూయాదవ్, జెడ్పీటీసీ శ్రీశైలంయాదవ్, తిరుమల్యాదవ్, మాజీ ఎంపీపీ బండ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.