క్రమశిక్షణ, ధార్మికత, ధార్మిక చింతనల మేలు కలయిక అయిన ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు రంజాన్ సందర్భం గా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి, సుగం ధ ద్రవ్యాలు పూసుకొని కళ్లకు సురుమా, తలకు టోపీ పెట్టుకొని పిల్లలు, పెద్దలు, వృ ద్ధులు నమాజ్లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ప్రవక్తలు ఇస్లాం సందేశాన్ని వినిపించి మ హ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని, సత్యమార్గా న్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికా రులు ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు. ప్రార్థనా స్థలాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.