భూత్పూర్: మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న సీసీ రోడ్లను నాణ్యతతో వేయాలని చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని 2వవార్డులోని తాండా నర్సింగాపూర్లో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనితీరును పరిశీలించారు. గత కొన్నిఏండ్ల నుంచి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రోడ్లకు మహర్దశ వచ్చిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి సహకారంతో మున్సిపాలిటీలో పలువార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వసంతాగోపాల్, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.