కోయిలకొండ, ఏప్రిల్ 28 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని ఎంపీపీ శశికళ అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో శుక్రవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ అంధత్వరహిత తెలంగాణ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. 18ఏండ్లు నిండినవారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలు, మందులను అం దజేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్ వనజ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్య, నాయకులు శ్రీనివాస్రెడ్డి, వాల్యానాయక్, వాస్యానాయక్ పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 28 : మండలంలోని చిన్నపల్లి, వల్లూర్, అల్వాన్పల్లి, నసుర్లాబాద్ గ్రామాల్లో కంటివెలుగు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. చిన్నపల్లిలో 170మందికి కంటి పరీక్షలు నిర్వహించి 14మందికి అద్దాలను పంపి ణీ చేశారు. మరో 39మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. వల్లూర్లో 180మందికి కంటి పరీక్షలు నిర్వహించి 25మం దికి అద్దాలను అందజేయగా, మరో 10మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. అల్వాన్పల్లిలో 178మందిని పరీక్షిం చి 17మందికి అద్దాలను అందజేయగా, మరో ఏడుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. నసుర్లాబాద్లో 186మందికి పరీక్షలు నిర్వహించి 19 మందికి అద్దాలను పంపిణీ చేయ గా, మరో నలుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. అలాగే మున్సిపాలిటీలోని 23వ వార్డులో 156మందిని పరీక్షించి 11మందికి అద్దాలను పంపిణీ చేయగా, మరో ఏడుగురికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. 24వ వార్డులో 163మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఆరుగురికి అద్దాలను అందజేయగా, మరో 9మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), ఏప్రిల్ 28 : కౌకుంట్ల మండలం డోకూర్, చిన్నచింతకుంట మండలం ముచ్చింత ల, ఉంద్యాల, పర్ధీపూర్ గ్రామాల్లో కంటివెలుగు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. డోకూర్లో 190మందికి కంటి పరీక్షలు నిర్వహించి 10మందికి అద్దాలను పంపిణీ చేయగా, మరో 11మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఉంద్యాలలో 152మందిని పరీక్షించి ముగ్గురికి అద్దాలను అందజేయగా, మరో నలుగురికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. ముచ్చింతలలో 162మందికి పరీక్షలు నిర్వహించి 15మందికి అద్దాలను పంపిణీ చేయగా, మరో 17మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. పర్ధీపూర్లో 157మందిని పరీక్షించి 34మందికి అద్దాలను అందజేయగా, మరో 28మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు సనా, సంతోష్, షఫీక్, రాధిక, రాహుల్, క్యాంప్ కోఆర్డినేటర్ రాజన్న, శ్రీనివాసులు, ఖాదర్, సుశీల పాల్గొన్నారు.
బాలానగర్, ఏప్రిల్ 28 : మండలంలోని చెన్నంగులగడ్డతండాలో 178మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఇద్దరికి అద్దాలను పంపిణీ చేయగా, మరో ఏడుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. తిరుమలగిరిలో 216మందిని పరీక్షించి 14మందికి అద్దాలను పంపిణీ చేయగా, మరో 13మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కాగా చెన్నంగులగడ్డతండాలో కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో కృష్ణారావు, ఎంపీవో నసీర్ అహ్మద్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
రాజాపూర్, ఏప్రిల్ 28 : మండలంలోని ఖానాపూర్లో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని సర్పంచ్ యాదమ్మ ప్రారంభించారు. కంటివెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా రాయపల్లిలో 147మందికి పరీక్ష లు నిర్వహించి ఐదుగురికి అద్దాలను పంపిణీ చేశారు. మరో 11మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. ఖానాపూర్లో 166మందిని పరీక్షించి 18మందికి అద్దాలను పంపిణీ చేయగా, మరో 43మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు డాక్టర్ మధుసూదన్రావు తెలిపారు. కార్యక్రమంలో కంటివెలుగు కోఆర్డినేటర్ శ్రీనివాసులు, డాక్టర్లు రవికుమార్, సురేశ్రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.