ఉమ్మడి జిల్లాలో జలం పుష్కలంగా లభిస్తున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం.. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల ఐఏబీ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీచైర్పర్సన్లు, కలెక్టర్లతో కలిసి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సూచనల మేరకు గతంలో ప్రాజెక్టుల వద్ద బస చేసి పనులు పూర్తి చేయించామని గుర్తు చేశారు. దీంతో నేడు సాగునీరు పుష్కలమై వ్యవసాయం పండుగలా జరుగుతున్నదన్నారు.
– నాగర్కర్నూల్, డిసెంబర్ 24
మహబూబ్నగర్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నవాబ్పేట : ప్రగతి సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పాలమూరు జిల్లాకు రానున్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి సోదరుడు, ఎంఎస్ఎన్ కంపెనీ అధినేత మన్నె సత్యనారాయణరెడ్డి సోదరుడు మన్నె వెంకట్రామిరెడ్డి ఇటీవల మృతి చెందిన విష యం తెలిసిందే.. ఆదివారం జరగనున్న దశదినకర్మలో పాల్గొనేందుకు సీఎం న వాబ్పేట మండలం గురుకుంట గ్రామానికి హెలిక్యాప్టర్లో చేరుకోనున్నారు. మ ధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట నుం చి బయలు దేరి ఒంటి గంట వరకు గ్రా మానికి చేరుకోనున్నారు. ఎంపీ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి వెంకట్రామిరెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించనున్నారు. కాగా శనివారం ఎంపీ ఇల్లు, పరిసరాల్లో ఏర్పాట్లను, హెలీప్యాడ్ స్థ లాన్ని బీఆర్ఎస్ నాయకులు, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, ఎంపీపీ అనంతయ్యతో కలిసి ఎంపీ మన్నె పరిశీలించారు.
హెలీప్యాడ్ నుంచి ఇంటికి చేరుకునే మార్గాన్ని సిద్ధం చేసే పనులను పూర్తి చేయించారు. సీఎం కేసీఆర్ గంటన్నరపాటు ఉండే అవకాశం ఉన్నది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీ మన్నె కుటుంబసభ్యులు, ముఖ్య నేతల ను తప్పా ఇతరులను పోలీసులు అనుమతించడం లేదు.
బందోబస్తును కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహేశ్ పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ, డీ ఎస్పీ, 10 మంది సీఐలు, 40 మంది ఎ స్సైలతోపాటు 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీఎం తిరి గి వెళ్లే వరకు భద్రత కొనసాగుతుందని ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ఈ నెల 4వ తేదీన నూతన సమీకృత కార్యాలయ ప్రారంభోత్సవానికి సీఎం హాజరయ్యారు. మరోసారి విచ్చేస్తుండడంతో ఒకే నెలలో రెండో సారి పర్యటన.