మహబూబ్నగర్/జడ్చర్ల టౌన్/అచ్చంపేట, జనవరి 2 : మోటర్ వాహన సవరణ చట్టం తీసుకురావడాన్ని నిరసిస్తూ ఆయిల్ ట్యాంకర్ల నిర్వాహకులు బు ధవారం నుంచి సమ్మె చేపట్టనున్నట్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ దొరకదన్న విషయాన్ని తెలుసుకున్న వాహనదారులు మంగళవారం ఉమ్మడి జిల్లాలోని ఆయా బంకుల వద్ద బారులుదీరారు. పలుచోట్ల నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. లారీలు, డీసీఎంలు, ఆటోలు, కార్లు క్యూలో గంటల తరబడి నిరీక్షించారు. అయితే, సమ్మె విరమించారని, వాహనదారులు ఆం దోళన చెందాల్సిన అవసరం లేదని బంక్ల యజమానులు తెలిపారు.