జడ్చర్ల, మే 16 : రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘట న సోమవారం జడ్చర్ల హౌసింగ్బోర్డు సమీపంలోని మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది. జడ్చర్ల సీఐ రమేశ్బాబు, కు టుంబసభ్యులు తెలిపిన వివరాల ప్ర కారం కోయిలకొండకు చెందిన యా దయ్య తనతల్లికి ఆరోగ్యం బాగలేకపోవడంతో చికిత్సనిమిత్తం సోమవా రం మధ్యాహ్నం కారులో కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. జడ్చర్ల సమీపంలోకి రా గానే రోడ్డు పక్కన ఓ ఇంటి ముందు మట్టిని చదును చేస్తున్న జేసీబీ ఒక్కసారిగా వెనుకకు రావడంతో కారు డ్రైవర్ దానిని గమనించకుండా స్పీడ్గా రావడంతో జేసీబీ వెనుకభాగంలోని బకెట్ను కారు ఢీకొట్టింది.
దీంతో కారు టాపు పూర్తిగా లేచిపోవడంతోపాటు కారులో ఉన్న ప్రమీల(55), యాదయ్య అలియాస్ రాజు (32) అక్కడికక్కడే మృతిచెందగా రాములమ్మ, యాదమ్మ, కారు డ్రైవర్ శివ(నవాబ్పేట్ మండలం కొం డాపూర్ గ్రామం)కు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని క్షతగ్రాతులను 108లో మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన యాదయ్యకు భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. అయితే తల్లీకొడుకులు మృతి చెందిన విషయం తెలవడంతో కుటుంబసభ్యులు, బంధువులు బాదేపల్లి దవాఖానకు చేరుకొని బోరున విలపించారు. తల్లీ కొడు కుల మృతితో కోయిలకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి.